ETV Bharat / state

అధికారుల నోటీసులు చూసి.. గుండె ఆగి వ్యక్తి మృతి!

అధికారులు పంపించిన నోటీసులు చూసి.. గుండె ఆగి ఓ వ్యక్తి చనిపోయిన ఘటన మేడ్చల్​ జిల్లా కుత్బుల్లాపూర్​ నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకుంది. రాజీవ్​ గృహకల్ప సముదాయంలోని కొందరు లబ్దిదారులు అదనంగా చేపట్టిన నిర్మాణాలు కూల్చేయాలని అధికారులు నోటీసులు పంపారు. ఆ నోటీసులు చూసి ఉద్వేగానికి లోనైన లబ్ధిదారుడు గుండె ఆగి చనిపోయాడు.

author img

By

Published : Sep 19, 2020, 9:53 PM IST

Man Died With Heart Attack Due To Ghmc Notice
అధికారుల నోటీసులు చూసి.. గుండె ఆగి వ్యక్తి మృతి!

మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లా కుత్బుల్లాపూర్​ నియోజకవర్గ పరిధిలోని జగద్గిరిగుట్ట రాజీవ్​ గృహకల్ప సముదాయంలో కొందరు లబ్ధిదారులు అదనంగా నిర్మాణాలు చేపట్టారు. వాటి కూల్చివేతలో భాగంగా జీహెచ్​ఎంసీ అధికారులు అదనపు నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు పంపించారు. తాము కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తారేమోనని ఉద్వేగానికి లోనై.. 47వ బ్లాక్​కి చెందిన రాములు అనే లబ్ధిదారుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో లబ్ధిదారులంతా భావోద్వేగానికి లోనయ్యారు. తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించగా.. కొద్దిసేపు జగద్గిరిగుట్ట రాజీవ్​ గృహకల్పలో ఉద్రిక్త వాతావారణం చోటు చేసుకుంది.

మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లా కుత్బుల్లాపూర్​ నియోజకవర్గ పరిధిలోని జగద్గిరిగుట్ట రాజీవ్​ గృహకల్ప సముదాయంలో కొందరు లబ్ధిదారులు అదనంగా నిర్మాణాలు చేపట్టారు. వాటి కూల్చివేతలో భాగంగా జీహెచ్​ఎంసీ అధికారులు అదనపు నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు పంపించారు. తాము కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తారేమోనని ఉద్వేగానికి లోనై.. 47వ బ్లాక్​కి చెందిన రాములు అనే లబ్ధిదారుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో లబ్ధిదారులంతా భావోద్వేగానికి లోనయ్యారు. తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించగా.. కొద్దిసేపు జగద్గిరిగుట్ట రాజీవ్​ గృహకల్పలో ఉద్రిక్త వాతావారణం చోటు చేసుకుంది.

ఇదీ చూడండి: 'ప్రత్యర్థుల నుంచి నాకు ప్రమాదం ఉంది.. భద్రత కల్పించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.