ETV Bharat / state

'భూ నిర్వాసితుల ఆందోళన... గోడు వినకుండా వెళ్లిన మంత్రి' - Minister Mallareddy Kistapur Park

తమ భూముల్లో అక్రమంగా పార్కు నిర్మిస్తున్నారంటూ దళితులు ఆందోళనకు దిగారు. ఆ పార్కు శంకుస్థాపనకు వచ్చే మంత్రికి గోడు చెప్పుకుందామంటే ఆయన వారిని పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఈ ఘటన మేడ్చల్​ మున్సిపల్​ పరిధిలోని కిష్టాపూర్​లో చోటుచేసుకుంది.

Protest For Land
Protest For Land
author img

By

Published : Feb 27, 2020, 11:10 PM IST

మేడ్చల్ పురపాలిక పరిధిలోని కిష్టాపూర్​లో పార్కు ఏర్పాటు కోసం తమ స్థలాన్ని తీసుకున్నారని ఆరోపిస్తూ కొందరు దళితులు ఆందోళనకు దిగారు. కిష్టాపూర్ రహదారి పక్కన సర్వే నంబర్​ 515లో ప్రభుత్వం తమకు 4.20 ఎకరాల భూమిని కేటాయించిందని వారు తెలిపారు. వంశ పారంపర్యంగా భూమిని సాగు చేసుకుంటున్నామన్నారు.

ఇప్పుడు లాక్కోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. భూమిని ప్రభుత్వం అక్రమంగా తీసుకుని పార్కు ఏర్పాటు చేయాలని చూస్తోందని ఆరోపించారు. పార్కు శంకుస్థాపనకు వస్తున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి తమగోడు చెప్పుకుందామంటే... ఆయన అక్కడ ఆగకుండా వెళ్లిపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

భూ నిర్వాసితుల గోడు వినని మంత్రి

ఇదీ చూడండి : గోపన్​పల్లి భూ ఆరోపణలపై స్పందించిన ఎంపీ రేవంత్​రెడ్డి

మేడ్చల్ పురపాలిక పరిధిలోని కిష్టాపూర్​లో పార్కు ఏర్పాటు కోసం తమ స్థలాన్ని తీసుకున్నారని ఆరోపిస్తూ కొందరు దళితులు ఆందోళనకు దిగారు. కిష్టాపూర్ రహదారి పక్కన సర్వే నంబర్​ 515లో ప్రభుత్వం తమకు 4.20 ఎకరాల భూమిని కేటాయించిందని వారు తెలిపారు. వంశ పారంపర్యంగా భూమిని సాగు చేసుకుంటున్నామన్నారు.

ఇప్పుడు లాక్కోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. భూమిని ప్రభుత్వం అక్రమంగా తీసుకుని పార్కు ఏర్పాటు చేయాలని చూస్తోందని ఆరోపించారు. పార్కు శంకుస్థాపనకు వస్తున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి తమగోడు చెప్పుకుందామంటే... ఆయన అక్కడ ఆగకుండా వెళ్లిపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

భూ నిర్వాసితుల గోడు వినని మంత్రి

ఇదీ చూడండి : గోపన్​పల్లి భూ ఆరోపణలపై స్పందించిన ఎంపీ రేవంత్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.