ETV Bharat / state

వీధికుక్కల స్వైరవిహారం... చిన్నారి మృతి

author img

By

Published : May 30, 2020, 8:20 PM IST

సికింద్రాబాద్​ బోడుప్పల్​ నగరపాలక పరిధిలో వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలిక.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మున్సిపాలిటీల్లో వీధికుక్కలు లేకుండా చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు.

child-died-in-street-dogs-attack-at-boduppal-in-hyderabad
వీధికుక్కల స్వైరవిహారం... చిన్నారి మృతి

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్​ నగర పురపాలక పరిధిలో దారుణం జరిగింది. వీధికుక్కల దాడిలో గాయపడ్డ ఓ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సుశీల టౌన్​షిప్​లో అంగోత్​ బేబీ(6) అనే బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ బాలికను తల్లిదండ్రులు ఉప్పల్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బాలికను నిలోఫర్​ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బేబీ మరణించింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం సాాయం చేయాలని.. మున్సిపాలిటీ పరిధిల్లో వీధికుక్కలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్​ చేశారు.

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్​ నగర పురపాలక పరిధిలో దారుణం జరిగింది. వీధికుక్కల దాడిలో గాయపడ్డ ఓ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సుశీల టౌన్​షిప్​లో అంగోత్​ బేబీ(6) అనే బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ బాలికను తల్లిదండ్రులు ఉప్పల్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బాలికను నిలోఫర్​ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బేబీ మరణించింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం సాాయం చేయాలని.. మున్సిపాలిటీ పరిధిల్లో వీధికుక్కలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: 'దోషం తొలిగిస్తాడనుకుంటే కోరిక తీర్చమన్నాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.