ETV Bharat / state

కుత్బుల్లాపూర్​లో 14 కరోనా పాజిటివ్​ కేసులు నమోదు

author img

By

Published : Jun 20, 2020, 7:03 PM IST

గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 19న సూరారంలోని పట్టణ ప్రాథమిక కేంద్రంలో 58 మంది రక్త నమూనాలు సేకరించి పరీక్షించగా అందులో 9 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. వివిధ ప్రాంతాల్లో కలిపి నియోజకవర్గ పరిధిలో మొత్తంగా ఈరోజు 14 కేసులు నమోదయ్యాయి.

14 Corona Positive Cases Files In Qutbullapur
కుత్బుల్లాపూర్​లో 14 కరోనా పాజిటివ్​ కేసులు నమోదు

సూరారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని 58 మంది రక్త నమూనాలు సేకరించి కరోనా పాజిటివ్​ పరీక్షలు చేయగా అందులో 9 మందికి పాజిటివ్​ ఉన్నట్టు తేలింది. వీరిని ప్రైమరీ కాంటాక్టు కేసులుగా పేర్కొంటూ మండల వైద్యాధికారి నిర్మల ప్రకటన చేశారు. కుత్బుల్లాపూర్​ రుక్మిణీ ఎస్టేట్​కు చెందిన ఓ వ్యక్తికి గతంలో పాజిటివ్ వచ్చింది. తాజాగా అతడి భార్య, కూతురు రక్త నమూనాలు పరీక్షించారు. వారికి కరోనా పాజిటివ్​ ఉన్నట్టు పరీక్షల్లో తేలింది.

పేట్ బషీరాబాద్​లోని ఓ విల్లాలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్​ నిర్ధారణ అయింది. జీడిమెట్లలో ఒకే ఇంట్లో ఉండే ఇద్దరు వ్యక్తులకు పాజిటివ్​ వచ్చింది. చింతల్​కు చెందిన భగత్​సింగ్​ నగర్​ కాలనీకి చెందిన ఒకరికి, షాపూర్​ నగర్​లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్​ వచ్చింది. వీరే కాకుండా..నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో నలుగురికి కూడా కరోనా వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. మొత్తంగా ఈ ఒక్కరోజే కుత్బుల్లాపూర్​ నియోజకవర్గంలో 14 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి.

సూరారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని 58 మంది రక్త నమూనాలు సేకరించి కరోనా పాజిటివ్​ పరీక్షలు చేయగా అందులో 9 మందికి పాజిటివ్​ ఉన్నట్టు తేలింది. వీరిని ప్రైమరీ కాంటాక్టు కేసులుగా పేర్కొంటూ మండల వైద్యాధికారి నిర్మల ప్రకటన చేశారు. కుత్బుల్లాపూర్​ రుక్మిణీ ఎస్టేట్​కు చెందిన ఓ వ్యక్తికి గతంలో పాజిటివ్ వచ్చింది. తాజాగా అతడి భార్య, కూతురు రక్త నమూనాలు పరీక్షించారు. వారికి కరోనా పాజిటివ్​ ఉన్నట్టు పరీక్షల్లో తేలింది.

పేట్ బషీరాబాద్​లోని ఓ విల్లాలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్​ నిర్ధారణ అయింది. జీడిమెట్లలో ఒకే ఇంట్లో ఉండే ఇద్దరు వ్యక్తులకు పాజిటివ్​ వచ్చింది. చింతల్​కు చెందిన భగత్​సింగ్​ నగర్​ కాలనీకి చెందిన ఒకరికి, షాపూర్​ నగర్​లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్​ వచ్చింది. వీరే కాకుండా..నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో నలుగురికి కూడా కరోనా వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. మొత్తంగా ఈ ఒక్కరోజే కుత్బుల్లాపూర్​ నియోజకవర్గంలో 14 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి.

ఇవీ చూడండి: ఎమ్మెల్యే రాజాసింగ్​ గన్​మెన్​కు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.