మెదక్ జిల్లా పాపన్నపేటలోని ఏడుపాయల వనదుర్గా మాత అమ్మవారి జాతర పురస్కరించుకొని వచ్చిన హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. సుమారు రూ. 58,61,337 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ శ్రీనివాస్ తెలిపారు. మహా శివరాత్రి సందర్భంగా 8 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అన్నారు.
ప్రత్యేక దర్శనం, ఒడి బియ్యం, కేశఖండన, ప్రసాదాలు కలిపి రూ. 40. 67 లక్షలు రాగా... అమ్మవారి హుండీ ద్వారా రూ. 17. 93 లక్షలు వచ్చినట్లు ఈఓ వెల్లడించారు.
ఇదీ చదవండి: బడ్జెట్పై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది కసరత్తు