ETV Bharat / state

'ఇప్పటికే 10 నెలలు పూర్తయింది - ఇంకెంత గడువు కావాలి?' - BRS PARTY CHANGES MLAS CASE UPDATE

బీఆర్​ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ - సుప్రీంకోర్టులో విచారణ - తదుపరి విచారణ ఫిబ్రవరి 18కి వాయిదా

BRS Party Changes MLAs Disqualification Petition Postponed
BRS Party Changes MLAs Disqualification Petition Postponed (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 10, 2025, 1:11 PM IST

BRS Party Changes MLAs Disqualification Petition Postponed : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్​పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఏడుగురు ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్​పై నిర్ణయం తీసుకోవడంలో తెలంగాణ స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సుప్రీంకోర్టులో రిట్​ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్ తన పిటిషన్​లో తెలంగాణ స్పీకర్​, ఎమ్మెల్యేలు పి.శ్రీనివాస్​రెడ్డి, బండ్ల కృష్ణమోహన్​రెడ్డి, కాలె యాదయ్య, టి.ప్రకాశ్​గౌడ్, అరెకపూడి గాంధీ, గూడెం మహిపాల్​రెడ్డి, ఎం.సంజయ్​ కుమార్​లను ప్రతివాదులుగా చేర్చారు. జస్టిస్ గవాయ్ ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్​పై విచారణ చేపట్టింది.

ఇంకెంత గడువు కావాలి : అసెంబ్లీ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా, స్పీకర్ నుంచి సమాచారం కోసం మరింత సమయం కావాలని రోహత్గీ కోర్టును కోరారు. స్పీకర్​తో చర్చించి వివరాలు అందిస్తామని కోర్టుకు చెప్పారు. ఇప్పటికే 10 నెలలు పూర్తయిందని, ఇంకెంత గడువు కావాలని ధర్మాసనం ప్రశ్నించింది. ముకుల్ రోహత్గీ విజ్ఞప్తితో పిటిషన్​పై తదుపరి విచారణను ఫిబ్రవరి 18 వాయిదా వేసింది.

BRS Party Changes MLAs Disqualification Petition Postponed : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్​పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఏడుగురు ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్​పై నిర్ణయం తీసుకోవడంలో తెలంగాణ స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సుప్రీంకోర్టులో రిట్​ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్ తన పిటిషన్​లో తెలంగాణ స్పీకర్​, ఎమ్మెల్యేలు పి.శ్రీనివాస్​రెడ్డి, బండ్ల కృష్ణమోహన్​రెడ్డి, కాలె యాదయ్య, టి.ప్రకాశ్​గౌడ్, అరెకపూడి గాంధీ, గూడెం మహిపాల్​రెడ్డి, ఎం.సంజయ్​ కుమార్​లను ప్రతివాదులుగా చేర్చారు. జస్టిస్ గవాయ్ ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్​పై విచారణ చేపట్టింది.

ఇంకెంత గడువు కావాలి : అసెంబ్లీ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా, స్పీకర్ నుంచి సమాచారం కోసం మరింత సమయం కావాలని రోహత్గీ కోర్టును కోరారు. స్పీకర్​తో చర్చించి వివరాలు అందిస్తామని కోర్టుకు చెప్పారు. ఇప్పటికే 10 నెలలు పూర్తయిందని, ఇంకెంత గడువు కావాలని ధర్మాసనం ప్రశ్నించింది. ముకుల్ రోహత్గీ విజ్ఞప్తితో పిటిషన్​పై తదుపరి విచారణను ఫిబ్రవరి 18 వాయిదా వేసింది.

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు షాక్ - నోటీసులు జారీ

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.