ETV Bharat / state

టాస్క్​ఫోర్స్ పోలీసుల దాడి.. 90 గంజాయి ప్యాకెట్ల స్వాధీనం - taskforce updates in medak shankarampeta mandal

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం స్టీల్ కంపెనీ దగ్గర టాస్క్​ఫోర్స్ పోలీసులు దాడి చేసి గంజాయి వ్యాపారం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్​ చేశారు. 90 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 10 వేల వరకు ఉంటుందని ఎక్సైజ్ టాస్క్​ఫోర్స్ సీఐ కృష్ణయ్య తెలిపారు.

taskforce police ride on ganjayi sellers and three people arrested
టాస్క్​ఫోర్స్ పోలీసుల దాడి.. 90 గంజాయి ప్యాకెట్ల స్వాధీనం
author img

By

Published : Oct 8, 2020, 8:32 AM IST

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మిర్జాపల్లి రహదారి పక్కన ఒక స్టీల్ కంపెనీ దగ్గర ఉన్న వర్కర్స్ కాలనీలోని ఓ ఇంట్లో గంజాయి వ్యాపారం చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. 90 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ టాస్క్​ఫోర్స్ సీఐ కృష్ణయ్య తెలిపారు.

వీటి విలువ 10 వేల వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి రామాయంపేట పోలీస్ స్టేషన్​కు తరలించారు. గంజాయి వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

ఇదీ చూడండి:'విద్యాసంస్థలు ఇప్పుడే తెరవలేం.. దసరా తర్వాతే నిర్ణయం'

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మిర్జాపల్లి రహదారి పక్కన ఒక స్టీల్ కంపెనీ దగ్గర ఉన్న వర్కర్స్ కాలనీలోని ఓ ఇంట్లో గంజాయి వ్యాపారం చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. 90 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ టాస్క్​ఫోర్స్ సీఐ కృష్ణయ్య తెలిపారు.

వీటి విలువ 10 వేల వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి రామాయంపేట పోలీస్ స్టేషన్​కు తరలించారు. గంజాయి వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

ఇదీ చూడండి:'విద్యాసంస్థలు ఇప్పుడే తెరవలేం.. దసరా తర్వాతే నిర్ణయం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.