ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ మెదక్ జిల్లా ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయం ముందు కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కండక్టర్లకు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలిపారు. ఆర్టీసీ నడుపుతున్న అద్దె బస్సులను రద్దు చేసి నూతన బస్సులు కొనుగోలు చేయాలని వారు కోరారు. సీపీఎస్, పీఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ యాప్లో కొత్త ఫీచర్స్