ETV Bharat / state

నిజాం షుగర్స్​ అమ్మకానికి ట్రిబ్యునల్​ గ్రీన్​ సిగ్నల్​ - employs

ఆసియాలోనే ప్రఖ్యాతి గాంచిన నిజాం దక్కన్ షుగర్స్ కర్మాగారాలు మూతపడనున్నాయి. మెదక్ జిల్లాలో ఉన్న  ఏకైక  నిజాం షుగర్ ఫ్యాక్టరీ  ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల భాగస్వామ్యంతో కొనసాగుతున్న  ఎన్​డీఎస్ఎల్ కర్మాగారం ఇక కనుమరుగుకానుంది.

నిజాం షుగర్స్​ అమ్మకానికి ట్రిబ్యునల్​ గ్రీన్​ సిగ్నల్​
author img

By

Published : Jun 14, 2019, 11:21 PM IST

మెదక్​ జిల్లాలోని నిజాం దక్కన్​ షుగర్స్​ లిమిటెడ్​ కనుమరుగు కానుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల 307 మంది ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారబోతోంది. ఈరోజు మెదక్ మండలంలోని మంభోజిపల్లిలో ఉన్న నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్​పై గురువారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ విక్రయానికి ఆదేశాలు జారీ చేయడం వల్ల కార్మికులు ఆందోళన చెందుతున్నారు.సీఐటీయూ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ గేటు వద్ద ఈరోజు కార్మికులు ధర్నా చేశారు. మెదక్​లో ఎన్ఎస్ఎల్​ కర్మాగారం ఏర్పాటై వందలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభించింది. చెరుకు రైతులకు చేతినిండా పని లభించింది. కానీ నేడు పరిశ్రమను మూతపడే పరిస్థితికి తీసుకువచ్చారు. మెదక్​లోని ఎన్ఎస్ఎల్ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశం డిమాండ్ చేశారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్​కు హాజరు కాకుండా నిర్లక్ష్యం చేసిందని అన్నారు.

నిజాం షుగర్స్​ అమ్మకానికి ట్రిబ్యునల్​ గ్రీన్​ సిగ్నల్​

ఇవీ చూడండి: 'కేసీఆర్​ తెలివైన అవినీతి పరుడు'

మెదక్​ జిల్లాలోని నిజాం దక్కన్​ షుగర్స్​ లిమిటెడ్​ కనుమరుగు కానుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల 307 మంది ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారబోతోంది. ఈరోజు మెదక్ మండలంలోని మంభోజిపల్లిలో ఉన్న నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్​పై గురువారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ విక్రయానికి ఆదేశాలు జారీ చేయడం వల్ల కార్మికులు ఆందోళన చెందుతున్నారు.సీఐటీయూ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ గేటు వద్ద ఈరోజు కార్మికులు ధర్నా చేశారు. మెదక్​లో ఎన్ఎస్ఎల్​ కర్మాగారం ఏర్పాటై వందలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభించింది. చెరుకు రైతులకు చేతినిండా పని లభించింది. కానీ నేడు పరిశ్రమను మూతపడే పరిస్థితికి తీసుకువచ్చారు. మెదక్​లోని ఎన్ఎస్ఎల్ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశం డిమాండ్ చేశారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్​కు హాజరు కాకుండా నిర్లక్ష్యం చేసిందని అన్నారు.

నిజాం షుగర్స్​ అమ్మకానికి ట్రిబ్యునల్​ గ్రీన్​ సిగ్నల్​

ఇవీ చూడండి: 'కేసీఆర్​ తెలివైన అవినీతి పరుడు'

Intro:TG_SRD_41_13_NDSL_VIS_AVB_C1...
యాంకర్ వాయిస్.... ఆసియాలోనే ప్రఖ్యాతి గాంచిన నిజాం దక్కన్ షుగర్స్ కర్మాగార లు మూతపడనున్నాయ. మెదక్ బోధన్ ..మెట్ పల్లి. కర్మాగారాలు....?


మెదక్ జిల్లాలో ఉన్న ఏకైక నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యాల భాగస్వామ్యంతో కొనసాగుతున్న ఎన్ డి ఎస్ ఎల్ కర్మాగారం ఇక కనుమరుగుకానుంది నిజాం షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 307 మంది ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారబోతుంది

ఈరోజు మెదక్ మండలంలోని మంభోజిపల్లి లో ఉన్న నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ పై నిన్న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ విక్రయానికి ఆదేశాలు జారీ చేయడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు దీంతో సిఐటియు ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ గేటు వద్ద ఈరోజు ధర్నా చేశారు ..
మెదక్ ఎన్ ఎస్ ఎఫ్ కర్మాగారం ఏర్పాటై వందలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభించింది చెరుకు రైతులకు ఈ కర్మాగారం చేతినిండా పని లభించింది కానీ నేడు పరిశ్రమను మూతపడే పరిస్థితికి తీసుకువచ్చారు

2015. డిసెంబర్లో ఫ్యాక్టరీ లే అప్ ప్రకటిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడంతో కార్మికుల కుటుంబాలు జీవితం దుర్భరంగా మారింది

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ మెదక్ లోని ఎన్ఎస్ఎల్ ఫ్యాక్టరీ ని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని సిటీ తరఫున డిమాండ్ చేశారు దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హాజరు కాకుండా నిర్లక్ష్యం చేసిందని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యత వహిస్తూ కార్మికుల పక్షాన సిఐటియు తరుపున ట్రిబ్యునల్ తో వాదించాలని అని అలాగే కే గత నాలుగు సంవత్సరాల నుంచి లేఔట్ ప్రకటించినప్పటి నుండి ఇప్పటివరకు కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఈ ఎస్ ఐ పిఎఫ్ కార్మికులకు అందలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొట్టమొదటగా వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని బహిరంగా సభ లో చెప్పిన కేసీఆర్ ర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం గానీ అటు ప్రజాప్రతినిధులు గాని ఎవరూ పట్టించుకోవడం లేదని తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆపిల్ చేయాలని డిమాండ్ చేశారు

ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు కార్మికుల తల నరకడమే అని అంటున్నారు మమ్మల్ని తీసుకునేటప్పుడు శాశ్వత ఉద్యోగులుగా తీసుకున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా మా గురించి ఆలోచించలేదు ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం శాశ్వతంగా కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు ఈ ఫ్యాక్టరీ తో పాటు మెదక్ బోధన్ మెట్ పల్లి యూనిట్లకు కూడా లే ఆఫ్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు దీంతో వందలాది మంది కార్మికులు ఉపాధి కరువై రోడ్డున పడ్డారు.. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు మల్లేశం బాలమణి ఎన్ఎస్ఎఫ్ కార్మికులు పాల్గొన్నారు

బైట్స్...
1. మల్లేశం.. సిఐటియు జిల్లా అధ్యక్షుడు
2. కిషన్.. ఎన్ ఎస్ ఎఫ్ శాశ్వత ఉద్యోగి
3. తిరుపతి రెడ్డి.. ఎన్ ఎస్ ఎఫ్ శాశ్వత ఉద్యోగి


Body:విజువల్స్


Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.