మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు దిశ హత్యకు నిరసనగా ర్యాలీ తీశారు. న్యాయం చేయాలని కోరుతూ.... పట్టణంలోని ప్రధాన వీధుల గుండా తిరిగారు. దిశపై పైశాచికంగా హత్యాచారం చేసిన నలుగురు నిందితులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా వారిని బహిరంగంగా ఉరి తీయాలని కోరారు. విద్యార్థులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులూ ర్యాలీలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: డాక్టర్ 'దిశ'కు న్యాయం కోసం 15 లక్షల సంతకాలు