ETV Bharat / state

విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్​ ధర్మారెడ్డి పర్యటించారు. వీధుల్లో తిరుగుతూ పారిశుద్ధ్య పనులు పరిశీలించారు.

author img

By

Published : Nov 1, 2019, 7:18 PM IST

మెదక్​లో కలెక్టర్​ ధర్మారెడ్డి పర్యటన
మెదక్​లో కలెక్టర్​ ధర్మారెడ్డి పర్యటన

మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్‌, కన్నారం గ్రామాల్లో జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి పర్యటించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు సరిగా లేవని కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 రోజుల ప్రణాళికలో పనులు సక్రమంగా చేయలేదని ప్రజాప్రతినిధులు, అధికారులపై మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారికి షోకాజ్‌ నోటీసులివ్వాలని డీపీవో హనోక్‌ను ఆదేశించారు.

మెదక్​లో కలెక్టర్​ ధర్మారెడ్డి పర్యటన

మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్‌, కన్నారం గ్రామాల్లో జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి పర్యటించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు సరిగా లేవని కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 రోజుల ప్రణాళికలో పనులు సక్రమంగా చేయలేదని ప్రజాప్రతినిధులు, అధికారులపై మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారికి షోకాజ్‌ నోటీసులివ్వాలని డీపీవో హనోక్‌ను ఆదేశించారు.

Intro:TG_ADB_13_05_30DAYS VILLAGE DEVELOPMENT SADASSU_AV_TS10032Body:మంచిర్యాల జిల్లా కేంద్రంలో 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు పై అవగాహన సదస్సు ప్రజాప్రతినిధులకు , అధికారులకు నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యే దివాకర్ రావు , జిల్లా పాలనాధికారి భారతి హోళీ కేరి హాజరైనారు.

సమావేశంలో జిల్లా పాలనాధికారి భారతి హోళీ కేరి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ సందేశాన్ని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు వినిపించారు. తెలంగాణ పల్లె సీమలు దేశంలోకెల్లా ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవాలని ప్రధాన లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర గ్రామీణ విధానానికి రూపకల్పన చేసిందని ఆమె తెలిపారు. గ్రామాలలో పచ్చదనం పరిశుభ్రత వెల్లివిరియాలని నియంత్రణతో విస్తృత ప్రజా భాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధి జరగాలని కలెక్టర్లతో ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారని కలెక్టర్ భారతి హోళీ కేరి సమావేశంలో అధికారులకు విన్నవించారు.
పల్లె ప్రగతి కి మంచి మార్గం వేయడానికి
రేపటి నుంచి 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజలు బాధ్యతగా వ్యవహరించి చేయి చేయి కలిపి సంయుక్తంగా ఆదర్శ గ్రామాలను నిర్మించుకోవాలని అదే ప్రభుత్వ ఆకాంక్ష అని శాసనసభ్యులు దివాకర్ రావు తెలిపారు. గ్రామాలలో మార్పు తేవడం కోసం గ్రామస్తులను ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని 30 రోజుల తర్వాత ఖచ్చితంగా గ్రామాలలో మార్పు రావాలని సమావేశంలో సూచించారు.

సీనియర్ అధికారుల నేతృత్వంలో వంద ఫ్లయింగ్ స్క్వాడ్ లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు తరువాత ఈ బృందాలు గ్రామాలలో ఆకస్మిక తనిఖీలు చేస్తాయని తెలిపారు. లక్ష్యాలు సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలు అజాగ్రత్త అలసత్వం ప్రదర్శించినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ భారతి హోళీ కేరి తెలిపారుConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.