రాష్ట్ర ప్రజలపై మోపుతున్న అధిక విద్యుత్ బిల్లుల భారాన్ని వెంటనే మాఫీ చేయాలని భాజపా నేత, మాజీ ఎమ్మెల్యే పట్లోరి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు మెదక్ ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయం వద్ద భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు.
పేద, మధ్య తరగతి ప్రజలపై మోపుతున్న విద్యుత్ ఛార్జీల అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించాలని శశిధర్ రెడ్డి అన్నారు. అదే విధంగా విద్యుత్ బిల్లుల చెల్లింపులో వెసులుబాటు కల్పించాలని కోరారు. ధర్నాలో నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణతోపాటు జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నర్సాపూర్ అసెంబ్లీ ఇన్ఛార్జీ గోపి, నాయకులు మల్లప్ప, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనా కట్టడి.. తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులతో గవర్నర్ సమీక్ష