ETV Bharat / state

దోమపోటు సోకిందని పంటకు నిప్పు పెట్టిన రైతన్న - medak district latest news

సర్కారు చెప్పిందని సన్న రకం వరి పంట సాగు చేస్తే.. తెగుళ్లు ఆశించి పంట పూర్తిగా దెబ్బతింది. పెట్టుబడి డబ్బులు సైతం చేతికందే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన రైతు.. తన చేతులతోనే పంటకు నిప్పంటించాడు.

A farmer set fire to a crop infected with mosquitoes
A farmer set fire to a crop infected with mosquitoes
author img

By

Published : Oct 31, 2020, 8:03 PM IST

మెదక్ మండలం పాతూర్​ గ్రామంలో కుంటి నాగరాజు అనే రైతు ఎకరం విస్తీర్ణంలో సన్న రకం వరి సాగు చేశాడు. పంట బాగానే ఎదిగినప్పటికీ.. చేతికొచ్చే సమయంలో దోమపోటు సోకింది. క్రిమి సంహారక మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోయింది.

ఈ క్రమంలోనే పెట్టిన పెట్టుబడి సైతం చేతికి రాదని మనస్తాపానికి గురైన నాగరాజు.. స్వయంగా తన చేతులతోనే పంటకు నిప్పు పెట్టాడు. చూస్తుండగానే పంటంతా కాలి బూడిదైంది. ప్రభుత్వం సన్న రకం వరి సాగు చేయించడం వల్లే తమకు ఈ దుస్థితి ఎదురైందని రైతు వాపోయాడు. దోమపోటుతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించి.. ఆదుకోవాలని కోరుతున్నాడు.

మెదక్ మండలం పాతూర్​ గ్రామంలో కుంటి నాగరాజు అనే రైతు ఎకరం విస్తీర్ణంలో సన్న రకం వరి సాగు చేశాడు. పంట బాగానే ఎదిగినప్పటికీ.. చేతికొచ్చే సమయంలో దోమపోటు సోకింది. క్రిమి సంహారక మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోయింది.

ఈ క్రమంలోనే పెట్టిన పెట్టుబడి సైతం చేతికి రాదని మనస్తాపానికి గురైన నాగరాజు.. స్వయంగా తన చేతులతోనే పంటకు నిప్పు పెట్టాడు. చూస్తుండగానే పంటంతా కాలి బూడిదైంది. ప్రభుత్వం సన్న రకం వరి సాగు చేయించడం వల్లే తమకు ఈ దుస్థితి ఎదురైందని రైతు వాపోయాడు. దోమపోటుతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించి.. ఆదుకోవాలని కోరుతున్నాడు.

ఇదీ చదంవడి: బండి సంజయ్‌పై తెరాస నేతల ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.