ETV Bharat / state

చెట్టు కింద తలదాచుకుంటే ప్రాణాలే పోయాయి..

మట్టి పని కోసం వెళ్లారు. వర్షం రావడంతో తలదాచుకున్నారు. అకస్మాత్తుగా పిడుగు పడి ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.

author img

By

Published : Aug 31, 2019, 12:04 PM IST

పిడుగుపాటుకు ఇద్దరు మృతి

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని కొల్లూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముండే సైదుల లింగయ్య, సమ్మయ్య వ్యవసాయ భూమిలో పనుల నిమిత్తం నిన్న సాయంత్రం వెళ్లగా వర్షం కురిసింది. ఈ క్రమంలో చెట్టు కిందికి వెళ్లగా అకస్మాత్తుగా పిడుగు పడడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలంలో వెతికారు. చెట్టు కింద ఇద్దరు విగత జీవులుగా కనిపించారు. లింగయ్యకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉండగా సమ్మయ్యకు ఒక కుమారుడు ఉన్నారు. నిరుపేదలయిన వీరికి ప్రభుత్వం సాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

పిడుగుపాటుకు ఇద్దరు మృతి

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని కొల్లూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముండే సైదుల లింగయ్య, సమ్మయ్య వ్యవసాయ భూమిలో పనుల నిమిత్తం నిన్న సాయంత్రం వెళ్లగా వర్షం కురిసింది. ఈ క్రమంలో చెట్టు కిందికి వెళ్లగా అకస్మాత్తుగా పిడుగు పడడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలంలో వెతికారు. చెట్టు కింద ఇద్దరు విగత జీవులుగా కనిపించారు. లింగయ్యకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉండగా సమ్మయ్యకు ఒక కుమారుడు ఉన్నారు. నిరుపేదలయిన వీరికి ప్రభుత్వం సాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

పిడుగుపాటుకు ఇద్దరు మృతి
Intro:Tg_adb_21_31_raitula mrurhi_av_TS10081Body:పిడుగు పడి ఇద్దరు రైతు మృతి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని కొల్లూరు గ్రామంలో విషాదంచోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే అదే గ్రామానికి చెందిన సైదుల లింగయ్య 50 మరియు కొట్టే సమ్మయ్య 40 దినసరి కూలీగా లింగయ్య వ్యవసాయ భూమిలో పనుల నిమిత్తం నిన్న సాయంత్రం వెళ్లగా వర్షం కురవడంతో ఒక చెట్టు క్రిందికి వెళ్లి ఉండగా పిడుగు పడడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలంకు వెళ్లడంతో చెట్టు కింద మృతదేహాలు పడివున్నాయ్.లింగయ్య కు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు సమ్మయ్య కు ఒక కుమారుడు ఉన్నారు నిరుపేదలయిన వీరికి ప్రభుత్వం సాయం అందించాలని కోరుచున్నాను మృతదేహాల వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారుConclusion:పేరు సారం సతీష్ కుమార్ జిల్లా మంచిర్యాల నియోజకవర్గం చెన్నూరు ఫోన్ నెంబర్ 9440233831
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.