ETV Bharat / state

మంచిర్యాలలో తెరాస ఆవిర్భావ వేడుకలు

మంచిర్యాలలో తెరాస ఆవిర్భావ దినోత్సవం నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన కోసం అమరులైన వీరులకు ఎమ్మెల్యే దివాకర్​రావు నివాళులు అర్పించారు.

author img

By

Published : Apr 27, 2020, 11:45 AM IST

Terasa manifestations in mancherial district
మంచిర్యాలలో తెరాస ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే దివాకర్​రావు ఆధ్వర్యంలో సాదాసీదాగా నిర్వహించారు. ఈ సందర్భంగా బైపాస్​ రోడ్డులోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర సాధన కోసం అమరులైన వీరులకు నివాళులు అర్పించారు.

కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు వేడుకలను నిరాడంబరంగా నిర్వహించినట్లు దివాకర్​రావు పేర్కొన్నారు. తెరాస ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తోందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసమే తమ పార్టీ అనునిత్యం పని చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే దివాకర్​రావు ఆధ్వర్యంలో సాదాసీదాగా నిర్వహించారు. ఈ సందర్భంగా బైపాస్​ రోడ్డులోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర సాధన కోసం అమరులైన వీరులకు నివాళులు అర్పించారు.

కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు వేడుకలను నిరాడంబరంగా నిర్వహించినట్లు దివాకర్​రావు పేర్కొన్నారు. తెరాస ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తోందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసమే తమ పార్టీ అనునిత్యం పని చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పింఛన్​దారులకు కరోనా వస్తే పరిస్థితేంటి..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.