మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట సమీపంలోని ఓ మామిడితోటలో మానసిక దివ్యాంగురాలిపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మండలంలోని నంసూరుకు చెందిన వార్డు సభ్యుడు లచ్చయ్య... మానసిక స్థిమితం సరిగాలేని ఓ బాలికకు మాయమాటలు చెప్పి గ్రామంలోని మామిడితోటకు తీసుకెళ్లి బలాత్కారం చేశాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు హాజీపూర్ పోలీసులు లచ్చయ్యపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు గతంలోనూ ఓ మహిళతో ఇలానే వ్యవహరించినట్లు స్థానికులు తెలిపారు.
ఇవీ చూడండి: తొలిగిన అవరోధాలు.. ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు