ETV Bharat / state

వంద పడకలతో కొవిడ్​ క్వారంటైన్​ కేంద్రం ఏర్పాటు

author img

By

Published : Apr 25, 2021, 10:59 PM IST

కరోనా సోకిన వారి కోసం మంచిర్యాల జిల్లా కేంద్రంలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. వంద పడకలతో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే దివాకర్ రావు పరిశీలించారు.

తెలంగాణ తాజా వార్తలు
మంచిర్యాలలో కరోనా కేసులు

హోం క్వారంటైన్​లో ఉండేందుకు అవకాశంలేని కొవిడ్​ బాధితులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్​ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే దివాకర్​రావు సూచించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వంద పడకలతో ఏర్పాటు చేసిన క్వారంటైన్​ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.

ఇక్కడ 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉంటారని... పౌష్టికాహారంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించామని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లాలో కొవిడ్​ కేసులు భారీగా పెరుగుతున్నాయని... ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ బయటకు రావొద్దని... వచ్చినప్పుడు మాస్కులు కచ్చితంగా ధరించాలని పేర్కొన్నారు.

హోం క్వారంటైన్​లో ఉండేందుకు అవకాశంలేని కొవిడ్​ బాధితులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్​ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే దివాకర్​రావు సూచించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వంద పడకలతో ఏర్పాటు చేసిన క్వారంటైన్​ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.

ఇక్కడ 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉంటారని... పౌష్టికాహారంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించామని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లాలో కొవిడ్​ కేసులు భారీగా పెరుగుతున్నాయని... ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ బయటకు రావొద్దని... వచ్చినప్పుడు మాస్కులు కచ్చితంగా ధరించాలని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: తెలంగాణలో ఆస్పత్రులు ఎంత భద్రం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.