మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు సమీపంలోని గోదావరి నదిలో పశువులను మేపుకుంటూ పోయి ఆరుగురు గొర్రెల కాపర్లు చిక్కుకున్నారు. అన్నారం బ్యారేజి నుంచి నీటి ఉద్ధృతి పెరగడం వల్ల వారు చిక్కుకుపోగా కొన్ని వస్తువులు కొట్టుకుపోయాయి. సమాచారం అందుకొని రంగంలోకి దిగిన పోలీసులు నాటు పడవలు తెప్పించి వారిని ఒడ్డుకు చేర్చారు. వారంతా సురక్షితంగా రావడం వల్ల కుటుంబసభ్యలు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చూడండి: దేవాదులలోకి దూసుకెళ్లిన ఆటో... తరువాత ఏమైందంటే..!