మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ ఏరియా గాంధీ నగర్లో శుక్రవారం అర్ధ రాత్రి మద్యం మత్తులో ముగ్గురు యువకులు వీరంగం సృష్టించారు. పాత కక్షలతో శ్రీనివాస్ అనే వ్యక్తిని యువకులు కత్తితో పొడిచారు.
గమనించిన స్థానికుడు పోలీసులకు సమాచారమందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుణ్ని ఆసుపత్రికి తరలించారు.
ముగ్గురు యువకుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు శ్రీరాంపూర్ ఎస్సై మంగీలాల్ తెలిపారు.