ETV Bharat / state

'కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం' - latest news on collector bharathi holikeri

జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన వారి పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి పేర్కొన్నారు. కరోనా పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

collector bharathi holikeri suggeted that we are taking serious actions against carona
'కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం'
author img

By

Published : Mar 20, 2020, 9:55 PM IST

జిల్లాలో వివిధ దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడానికి అధికారులు గ్రామీణ స్థాయిలో సర్వే చేస్తున్నారని జిల్లా పాలనాధికారి భారతీ హోళికేరి పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణతో కలిసి సమావేశం నిర్వహించారు.

విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా వ్యాధి సోకుతున్నట్లు సమాచారం ఉన్నందున అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని కలెక్టర్‌ పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను గ్రామాల వారీగా సేకరిస్తున్నామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి.. వారి ఎడమ చేతిపై తేదీతో కూడిన స్టాంప్ వేస్తామని తెలిపారు. మహారాష్ట్ర నుంచి రహదారి మార్గంలో జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నందున.. సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.

కరోనా వైరస్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని రామగుండం సీపీ సత్యనారాయణ హెచ్చరించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో కరోనా వ్యాధి ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు. ముందస్తు నివారణ చర్యలతోనే కరోనా వ్యాధిని అంతం చేయవచ్చని సూచించారు.

'కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం'

ఇదీ చూడండి: సీఏఏ వ్యతిరేక తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

జిల్లాలో వివిధ దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడానికి అధికారులు గ్రామీణ స్థాయిలో సర్వే చేస్తున్నారని జిల్లా పాలనాధికారి భారతీ హోళికేరి పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణతో కలిసి సమావేశం నిర్వహించారు.

విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా వ్యాధి సోకుతున్నట్లు సమాచారం ఉన్నందున అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని కలెక్టర్‌ పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను గ్రామాల వారీగా సేకరిస్తున్నామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి.. వారి ఎడమ చేతిపై తేదీతో కూడిన స్టాంప్ వేస్తామని తెలిపారు. మహారాష్ట్ర నుంచి రహదారి మార్గంలో జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నందున.. సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.

కరోనా వైరస్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని రామగుండం సీపీ సత్యనారాయణ హెచ్చరించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో కరోనా వ్యాధి ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు. ముందస్తు నివారణ చర్యలతోనే కరోనా వ్యాధిని అంతం చేయవచ్చని సూచించారు.

'కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం'

ఇదీ చూడండి: సీఏఏ వ్యతిరేక తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.