ETV Bharat / state

రైతులకు వరం కాబోతున్న పట్నం చెత్త

పర్యావరణ దినోత్సవం నాటికి బెల్లంపల్లి మున్సిపాలిటీని ప్లాస్టిక్‌ రహితంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇక్కడి అధికారులు. అందుకోసం చెత్తను కూడా ఉపయోగపడేలా  ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తడి చెత్తను కంపోస్ట్​ ఎరువుగా మారుస్తూ... రైతులకు అందించాలని సన్నాహాలు చేస్తున్నారు.

author img

By

Published : May 26, 2019, 7:58 PM IST

bellempally
చెత్త నిర్వహణకు సరికొత్త ఆలోచన

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పురపాలక సంఘంలో ప్లాస్టిక్​ను తరిమి కొట్టడానికి మున్సిపాలిటీ నడుం బిగించింది. మున్సిపల్ కమిషనర్ త్రయంబకేశ్వర్ రావు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. బెల్లంపల్లి పట్టణంలో రోజుకు 18 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. పొడి చెత్తనుంచి ప్లాస్టిక్‌ను వేరు చేసేందుకు ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ పనిని స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. ఇప్పటికే వారికి సిద్దిపేటలో శిక్షణనిచ్చారు.

కూరగాయల మార్కెట్​లో వచ్చే వ్యర్థాలను సేకరిస్తున్నారు. దీన్ని కంపోస్ట్ ఎరువుగా మారుస్తున్నారు. ఇప్పటి వరకు 300 కిలోల వరకు తయారు చేశారు. తయారు చేసిన ఎరువును రైతులకు అందించాలని సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ఇంటికి తడి, పొడి చెత్తను వేరు చేయడం కోసం రెండు డబ్బాలను అందిస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ త్రయంబకేశ్వర్‌రావు పేర్కొన్నారు. జూన్‌ 5న పర్యావరణ దినోత్సవం నాటికి బెల్లంపల్లిని ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా మార్చడమే తమ లక్ష్యమని తెలిపారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

ఇదీ చూడండి: పేదల ఆకలి తీర్చే.. సర్వ్​ నీడీ

చెత్త నిర్వహణకు సరికొత్త ఆలోచన

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పురపాలక సంఘంలో ప్లాస్టిక్​ను తరిమి కొట్టడానికి మున్సిపాలిటీ నడుం బిగించింది. మున్సిపల్ కమిషనర్ త్రయంబకేశ్వర్ రావు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. బెల్లంపల్లి పట్టణంలో రోజుకు 18 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. పొడి చెత్తనుంచి ప్లాస్టిక్‌ను వేరు చేసేందుకు ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ పనిని స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. ఇప్పటికే వారికి సిద్దిపేటలో శిక్షణనిచ్చారు.

కూరగాయల మార్కెట్​లో వచ్చే వ్యర్థాలను సేకరిస్తున్నారు. దీన్ని కంపోస్ట్ ఎరువుగా మారుస్తున్నారు. ఇప్పటి వరకు 300 కిలోల వరకు తయారు చేశారు. తయారు చేసిన ఎరువును రైతులకు అందించాలని సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ఇంటికి తడి, పొడి చెత్తను వేరు చేయడం కోసం రెండు డబ్బాలను అందిస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ త్రయంబకేశ్వర్‌రావు పేర్కొన్నారు. జూన్‌ 5న పర్యావరణ దినోత్సవం నాటికి బెల్లంపల్లిని ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా మార్చడమే తమ లక్ష్యమని తెలిపారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

ఇదీ చూడండి: పేదల ఆకలి తీర్చే.. సర్వ్​ నీడీ

Intro:రిపోర్టర్ : ముత్తె వెంకటేష్
సెల్ నంబర్: 9949620369
tg_adb_81_22_muncipati_copost_eruvu_pkg_c7
తడి, పొడి చెత్త సేకరణకు శ్రీకారం
ప్లాస్టిక్...మానవ మనుగడను భవిష్యత్ లో ప్రశ్నర్ధకం చేసే ఓ వినాశక హేతువు. ఇలాంటి ప్లాస్టిక్ వాడకం రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. పాల సంచి నుంచి మొదలు ఇంటి ప్రతి అవసరానికి ప్లాస్టిక్ ను విరివిగా వినియోగిస్తున్నారు. దీన్ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తిగత మార్పు అవసరం.
* మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పురపాలక సంఘంలో ప్లాస్టిక్ ను తరిమి కొట్టడానికి మున్సిపాలిటీ నడుం బిగించింది. మున్సిపల్ కమిషనర్ త్రియంబకేశ్వర్ రావు ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. పట్టణంలోని 34 వార్డుల్లో తడి, పొడి చెత్తల సేకరణకు ఈ నెల 7 వ తేదీ నుంచి శ్రీకారం చుట్టారు. బెల్లంపల్లి పట్టణంలో రోజుకు 18 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు.
ఇప్పటి వరకు బెల్లంపల్లి కన్నాల బస్తి సమీపంలో ఉన్న డంపింగ్ యార్డులో ప్లాస్టిక్, తడి చెత్తలను వేరు చేస్తున్నారు. ప్లాస్టిక్ ను వేరు చేసే పనిని స్యయం సహాయ సంఘాల మహిళల కు అప్పగించారు. ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను వేరు చేసి వాటిని విక్రయిస్తారు. కంపోస్ట్ ఎరువు ఇప్పటి వరకు 300 కిలోల వరకు తయారు చేశారు. ఈ ఎరువును చుట్టూ పక్కల గ్రామాల రైతులకు అందజేసి దాని ఉపయోగాన్ని తెలుసుకుంటారు. అయితే ఈ డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ ను ప్రారబించి ఇక్కడ చెత్తను వేరు చేస్తున్నారు. ప్రతి రోజు ఈ సేకరణ కొనసాగుతుంది. కూరగాయల మార్కెట్ లో కూరగాయల వ్యర్థాలను ఇక్కడికి తరలించి ఎండబెట్టి అందులో ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేసి కంపోస్ట్ ఎరువును తయారు చేస్తున్నారు. ప్రతి ఇంటికి చెత్త వేరుకు రెండు డబ్బాలను అందజేస్తామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఇప్పటికే సిద్దిపేటలో స్యయం సహాయక సంఘాల సబ్యులకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. జూన్ 5 పర్యావరణ దినోత్సవం నాటికి బెల్లంపల్లి పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తయారు చేస్తామని ఇందుకు పట్టణ ప్రజల సహకారం అవసరమని తెలిపారు. ప్లాస్టిక్ ను వాడటం ప్రతి ఒక్కరు తగ్గించాలని కోరారు.


Body:బైట్స్
త్రియంబీకేశ్వర్ రావు, మున్సిపల్ కమిషనర్, బెల్లంపల్లి
హరికాంత్, పర్యావరణ ఈఈ
వెంకట రమణమ్మ, స్వయం సహాయక సంఘం సభ్యురాలు


Conclusion:బెల్లంపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.