ETV Bharat / state

వరుణాగ్రహం... ఇంటి పైకప్పు కూలి తల్లీకూతుళ్ల దుర్మరణం

author img

By

Published : Aug 19, 2020, 6:46 AM IST

Updated : Aug 19, 2020, 10:08 AM IST

BREAKING
వరుణాగ్రహం... ఇంటి పైకప్పు కూలి తల్లీకూతుళ్ల దుర్మరణం

06:41 August 19

ఇంటి పైకప్పు కూలి ముగ్గురు దుర్మరణం

వర్షం మిగిల్చిన విషాదమిది. రేపటి గురించి ఆలోచిస్తూ నిద్రించిన ముగ్గురి జీవితాలు నిద్రలోనే ఆగిపోయిన కన్నీటి గాథ ఇది! ఏం జరిగిందో.. ఎందుకు చనిపోయామో.. తెలియకుండానే ఈ భువిని వదిలేసి వెళ్లిపోయిన తల్లీకూతుళ్ల ఆత్మ రోదన ఇది... వరుణుడు రాసిన మరణ శాసనమిది! ఇల్లు కూలి తల్లి, ఇద్దరు కూతుళ్లు మరణించిన విషాదమిది... 

వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఆ అమాయకుల ప్రాణాలు తీసింది. ఏమి జరుగుతుందో తెలిసే లోపే ముగ్గురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ప్రశాంతంగా నిద్రపోయిన వారు కళ్లు కూడా తెరవకుండానే... శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. ఇంతకీ వారికి ఏమైంది? వారి మరణానికి, వర్షానికి సంబంధం ఏంటి?

మహబూబ్​నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాలలో విషాదం చోటుచేసుకుంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి ఇంటి పైకప్పు కూలింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లి శరణమ్మ, కుమార్తెలు వైశాలి, భవానిలు మృత్యువాత పడ్డారు.  

విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ సీతారామరావు, జిల్లా అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికితీయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  

06:41 August 19

ఇంటి పైకప్పు కూలి ముగ్గురు దుర్మరణం

వర్షం మిగిల్చిన విషాదమిది. రేపటి గురించి ఆలోచిస్తూ నిద్రించిన ముగ్గురి జీవితాలు నిద్రలోనే ఆగిపోయిన కన్నీటి గాథ ఇది! ఏం జరిగిందో.. ఎందుకు చనిపోయామో.. తెలియకుండానే ఈ భువిని వదిలేసి వెళ్లిపోయిన తల్లీకూతుళ్ల ఆత్మ రోదన ఇది... వరుణుడు రాసిన మరణ శాసనమిది! ఇల్లు కూలి తల్లి, ఇద్దరు కూతుళ్లు మరణించిన విషాదమిది... 

వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఆ అమాయకుల ప్రాణాలు తీసింది. ఏమి జరుగుతుందో తెలిసే లోపే ముగ్గురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ప్రశాంతంగా నిద్రపోయిన వారు కళ్లు కూడా తెరవకుండానే... శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. ఇంతకీ వారికి ఏమైంది? వారి మరణానికి, వర్షానికి సంబంధం ఏంటి?

మహబూబ్​నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాలలో విషాదం చోటుచేసుకుంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి ఇంటి పైకప్పు కూలింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లి శరణమ్మ, కుమార్తెలు వైశాలి, భవానిలు మృత్యువాత పడ్డారు.  

విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ సీతారామరావు, జిల్లా అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికితీయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  

Last Updated : Aug 19, 2020, 10:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.