ETV Bharat / state

ఇక్కడ కూరగాయలు అమ్మబడవు!

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి లక్షల రూపాయలు మంజూరు చేస్తే అధికారుల నిర్లక్ష్యంతో అవి బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. ఏడు నెలలు గడిచినా ఇంతవరకు రైతు బజారు క్రయవిక్రయాలకు నోచుకోలేదు. వ్యాపారస్తులు ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ రోడ్లపైనే కూరగాయలు విక్రయిస్తున్నారు.

author img

By

Published : Mar 10, 2019, 12:03 AM IST

ప్రారంభానికి నోచుకోని రైతు బజారు
ప్రారంభానికి నోచుకోని రైతు బజారు
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ పరిసరాల రైతులు కూరగాయలు తెచ్చి రోడ్లపై అమ్ముకుంటున్నారని వారి సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదిజూలై 30న శాసనసభ్యుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి కూరగాయల మార్కెట్ యార్డ్​ను ప్రారంభించారు. అయితే అధికారులు మాత్రం రైతులకు కేటాయించలేదు. వారి నిర్లక్ష్యంతో ఏడు నెలలు గడిచినా రైతు బజారు క్రయవిక్రయాలకు నోచుకోలేదు.

అధికారుల నిర్లక్ష్యం తమకు శాపం

ఈ విషయంలో ప్రభుత్వ అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోయిందని చెప్తున్నారు. ఇప్పటికైనా వారు స్పందించి టెండర్లు ప్రకటిస్తే అందరం కలిసికట్టుగా వ్యాపారం చేసుకుంటామంటున్నారు వ్యాపారస్తులు. అధికారుల నిర్లక్ష్యం తమకు శాపంగా మారిందని వాపోతున్నారు కూరగాయల రైతులు, వ్యాపారులు.

ఇవీ చూడండి:తెరాసకు ఓటేస్తే మోరీలో వేసినట్టే: ఉత్తమ్

ప్రారంభానికి నోచుకోని రైతు బజారు
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ పరిసరాల రైతులు కూరగాయలు తెచ్చి రోడ్లపై అమ్ముకుంటున్నారని వారి సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదిజూలై 30న శాసనసభ్యుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి కూరగాయల మార్కెట్ యార్డ్​ను ప్రారంభించారు. అయితే అధికారులు మాత్రం రైతులకు కేటాయించలేదు. వారి నిర్లక్ష్యంతో ఏడు నెలలు గడిచినా రైతు బజారు క్రయవిక్రయాలకు నోచుకోలేదు.

అధికారుల నిర్లక్ష్యం తమకు శాపం

ఈ విషయంలో ప్రభుత్వ అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోయిందని చెప్తున్నారు. ఇప్పటికైనా వారు స్పందించి టెండర్లు ప్రకటిస్తే అందరం కలిసికట్టుగా వ్యాపారం చేసుకుంటామంటున్నారు వ్యాపారస్తులు. అధికారుల నిర్లక్ష్యం తమకు శాపంగా మారిందని వాపోతున్నారు కూరగాయల రైతులు, వ్యాపారులు.

ఇవీ చూడండి:తెరాసకు ఓటేస్తే మోరీలో వేసినట్టే: ఉత్తమ్

Intro:Tg_mbnr_04_09_praranbaniki_nochukoni_raithubajar_pkg_C12
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి రూపాయలు లక్షలు మంజూరు చేస్తే అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి బూడిదలో పోసిన పన్నీరులా మారాయి.


Body:నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ పరిసరాల్లో నీ రైతులు కూరగాయలు తెచ్చి రోడ్లపై అమ్ముకోవడంతో వారి సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 30 జూలై 2018 న ప్రస్తుత శాసనసభ్యుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి కూరగాయల మార్కెట్ యార్డ్ ని ప్రారంభించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏడు నెలలు అయినా కూడా ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు వ్యాపారస్తులు ఎండల్లో వానల్లో కూరగాయల వ్యాపారం సంవత్సరాల నుంచి ఎండల్లో ఎండుతూ వానలో తడుస్తూ వ్యాపారం చేపడుతున్నారు అరకొర సదుపాయాలతో మార్కెట్లు బతుకు వెళ్లదీస్తున్నారు దుకాణాల కేటాయింపులు త్వరగా పూర్తి చేసి వ్యాపారులకు అందించాలని వ్యాపారస్తులు అభిప్రాయపడుతున్నారు. కూరగాయల వ్యాపారస్తులకు కనీస సదుపాయాలు కూడా లేవు అని తెలిపారు.ప్రభుత్వ అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినా ప్రయోజనం లేదు అని చెప్తున్నారు. ఇప్పటికైనా పురపాలక అధికారులు స్పందించి టెండర్లు ప్రకటిస్తే అందరం కలిసికట్టుగా వ్యాపారం చేసుకుంటామని కూరగాయల వ్యాపారస్తులు తెలుపుతున్నారూ.


Conclusion:బైట్స్
1) వెంకటమ్మ కూరగాయల వ్యాపారి
2)అంజమ్మ. కూరగాయల వ్యాపారి
3)లక్ష్మీ. కూరగాయల వ్యాపారి
4)లక్ష్మీ. కూరగాయల వ్యాపారి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.