ETV Bharat / state

Minister Srinivas Goud: సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు​

author img

By

Published : Jun 5, 2021, 10:28 PM IST

సీఎం కేసీఆర్​ రాష్ట్ర వ్యాప్తంగా 19 డయాగ్నస్టిక్​ కేంద్రాలు మంజూరు చేయడంపై.. మంత్రి శ్రీనివాస్​గౌడ్​ కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో మహబూబ్​నగర్​తో పాటు, గద్వాలకు వీటిని మంజూరు చేశారని చెప్పారు.

Minister Srinivas Goud
Minister Srinivas Goud

మహబూబ్​నగర్​ ప్రభుత్వ జనరల్​ ఆసుపత్రికి డయాగ్నస్టిక్ కేంద్రం మంజూరు చేసినందున రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రి శ్రీనివాస్​గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సమయంలో 500 పడకలతో పాటు.. ఆక్సిజన్​, వెంటిలేటర్లు ఏర్పాటు చేసి హైదరాబాద్​కు సమానంగా మహబూబ్​నగర్​ ఆసుపత్రిని తీర్చిదిద్ది హైదరాబాద్​ వెళ్లే పని లేకుండా.. సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు.

సోమవారం నుంచి ఈ కేంద్రం ప్రారంభమవుతుందని చెప్పారు. రోగనిర్ధరణ కోసం జరిగే పరీక్షలకు అయ్యే ఖర్చును పేద ప్రజలు భరించలేరని.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా 19 డయాగ్నిస్టిక్ కేంద్రాలు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో మహబూబ్​నగర్​తో పాటు, గద్వాలకు వీటిని మంజూరు చేశారని చెప్పారు. ఈ డయాగ్నస్టిక్ కేంద్రాల ద్వారా 57 పరీక్షలు నిర్వహిస్తారని.. ముఖ్యంగా షుగర్​, 2డీ ఎకో, సీటీస్కాన్​తో పాటు.. కరోనా నిర్ధరణ పరీక్షలను అత్యాధునిక యంత్రాలతో నిర్వహిస్తారని స్పష్టం చేశారు. గంటకు 400 నుంచి 800 రిపోర్టులు తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ డయాగ్నస్టిక్ కేంద్రంలో పనిచేసేందుకు అవసరమైన పాథాలజీ, రేడియాలజిస్టులు ఇతర నిపుణులను త్వరలోనే నియమించుకోవడం జరుగుతుందని వివరించారు. కార్పొరేట్​ ఆసుపత్రుల తరహాలో మహబూబ్​నగర్​ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాగ్నస్టిక్ కేంద్రాన్ని తీర్చిదిద్దుతామని.. ఇంకా మెరుగైన వైద్య సేవలు అందిస్తామని హామీనిచ్చారు.

మహబూబ్​నగర్​ ప్రభుత్వ జనరల్​ ఆసుపత్రికి డయాగ్నస్టిక్ కేంద్రం మంజూరు చేసినందున రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రి శ్రీనివాస్​గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సమయంలో 500 పడకలతో పాటు.. ఆక్సిజన్​, వెంటిలేటర్లు ఏర్పాటు చేసి హైదరాబాద్​కు సమానంగా మహబూబ్​నగర్​ ఆసుపత్రిని తీర్చిదిద్ది హైదరాబాద్​ వెళ్లే పని లేకుండా.. సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు.

సోమవారం నుంచి ఈ కేంద్రం ప్రారంభమవుతుందని చెప్పారు. రోగనిర్ధరణ కోసం జరిగే పరీక్షలకు అయ్యే ఖర్చును పేద ప్రజలు భరించలేరని.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా 19 డయాగ్నిస్టిక్ కేంద్రాలు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో మహబూబ్​నగర్​తో పాటు, గద్వాలకు వీటిని మంజూరు చేశారని చెప్పారు. ఈ డయాగ్నస్టిక్ కేంద్రాల ద్వారా 57 పరీక్షలు నిర్వహిస్తారని.. ముఖ్యంగా షుగర్​, 2డీ ఎకో, సీటీస్కాన్​తో పాటు.. కరోనా నిర్ధరణ పరీక్షలను అత్యాధునిక యంత్రాలతో నిర్వహిస్తారని స్పష్టం చేశారు. గంటకు 400 నుంచి 800 రిపోర్టులు తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ డయాగ్నస్టిక్ కేంద్రంలో పనిచేసేందుకు అవసరమైన పాథాలజీ, రేడియాలజిస్టులు ఇతర నిపుణులను త్వరలోనే నియమించుకోవడం జరుగుతుందని వివరించారు. కార్పొరేట్​ ఆసుపత్రుల తరహాలో మహబూబ్​నగర్​ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాగ్నస్టిక్ కేంద్రాన్ని తీర్చిదిద్దుతామని.. ఇంకా మెరుగైన వైద్య సేవలు అందిస్తామని హామీనిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.