ETV Bharat / state

మహిళలను ఎదగనిద్దాం

ఎన్ని చట్టాలున్నా..సంక్షేమ పథకాలున్నా...సమాజంలో మార్పు వచ్చినప్పుడే ఆడపిల్లల్ని కాపాడుకోవడం సాధ్యమవుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాలమూరులో సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యక్రమానికి హాజరయ్యారు

author img

By

Published : Feb 26, 2019, 7:44 PM IST

మహిళలను ఎదగనిద్దాం

ఆడపిల్లల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మి లాంటి పథకాలను ప్రవేశపెట్టిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాబోయే మంత్రి వర్గంలో ఇద్దరు మహిళలకు చోటు కల్పించనున్నట్లు సీఎం ప్రకటనను గుర్తు చేశారు. మహబూబ్​నగర్​లో గైనకాలజీ వైద్యులు ఏర్పాటు చేసిన సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు.
ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైంది మహిళలైతే.. పురుషులు పదవుల్ని అనుభవించడం సిగ్గుచేటన్నారు. మహిళల్ని ఎదగనిచ్చినప్పుడే రాజకీయాలపైనా వారికి విశ్వాసం ఏర్పడుతుందని తద్వారా సుపరిపాలనలోనూ భాగస్వాములు అవుతారని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

పాలమూర్​లో సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యక్రమం

ఇవీ చదవండి:అమెజాన్​లోకి నూయీ

ఆడపిల్లల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మి లాంటి పథకాలను ప్రవేశపెట్టిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాబోయే మంత్రి వర్గంలో ఇద్దరు మహిళలకు చోటు కల్పించనున్నట్లు సీఎం ప్రకటనను గుర్తు చేశారు. మహబూబ్​నగర్​లో గైనకాలజీ వైద్యులు ఏర్పాటు చేసిన సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు.
ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైంది మహిళలైతే.. పురుషులు పదవుల్ని అనుభవించడం సిగ్గుచేటన్నారు. మహిళల్ని ఎదగనిచ్చినప్పుడే రాజకీయాలపైనా వారికి విశ్వాసం ఏర్పడుతుందని తద్వారా సుపరిపాలనలోనూ భాగస్వాములు అవుతారని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

పాలమూర్​లో సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యక్రమం

ఇవీ చదవండి:అమెజాన్​లోకి నూయీ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.