ETV Bharat / state

నిర్లక్ష్యం: విద్యుత్​ స్తంభం మీదపడి సైకిల్​పై వెళ్తున్న వ్యక్తి మృతి

author img

By

Published : Sep 4, 2020, 9:04 AM IST

ఒకరి నిర్లక్ష్యం మరో వ్యక్తి ప్రాణాలను బలికొన్న ఘటన మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్రలో చోటుచేసుకొంది. డ్రైవర్​ నిర్లక్ష్యంతో కాంక్రీట్​ కలిపే యంత్రం విద్యుత్​ స్తంభాలను ఢీకొట్టింది. ఆ స్తంభాలు మీదపడి.. ఆ సమయంలో అక్కడే ఉన్న వ్యక్తిని బలితీసుకున్నాయి.

Man dies on power pole collapsed on him while he was riding on bicycle
నిర్లక్ష్యం: విద్యుత్​ స్తంభం మీదపడి సైకిల్​పై వెళ్తున్న వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు.. రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాలు ఒక్కసారిగా నేలకూలాయి. అదే సమయంలో రోడ్డుపై సైకిల్ మీదుగా వెళ్తున్న ఓ వ్యక్తిపై పడడం వల్ల అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్రలో చోటు చేసుకుంది.

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని జీనుగురాల గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కాంక్రీట్​ కలిపే యంత్రం ఢీకొని వరుసగా మూడు విద్యుత్​ స్తంభాలు నేలకూలాయి. అదే సమయంలో సైకిల్​పై వెళ్తున్న ఆంజనేయులుపై పడ్డాయి. తీవ్రగాయాలతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. యంత్ర చోదకుడి నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ప్రమాదవశాత్తు.. రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాలు ఒక్కసారిగా నేలకూలాయి. అదే సమయంలో రోడ్డుపై సైకిల్ మీదుగా వెళ్తున్న ఓ వ్యక్తిపై పడడం వల్ల అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్రలో చోటు చేసుకుంది.

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని జీనుగురాల గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కాంక్రీట్​ కలిపే యంత్రం ఢీకొని వరుసగా మూడు విద్యుత్​ స్తంభాలు నేలకూలాయి. అదే సమయంలో సైకిల్​పై వెళ్తున్న ఆంజనేయులుపై పడ్డాయి. తీవ్రగాయాలతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. యంత్ర చోదకుడి నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇవీచూడండి: ప్రమాదం: అదుపుతప్పి కారు బోల్తా.. ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.