ETV Bharat / state

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా

author img

By

Published : Jul 29, 2020, 11:52 AM IST

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కేవలం మంగళవారం ఒక్కరోజే 166 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1736కు చేరింది.

corona cases increase in mahabubnagar
ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. మంగళవారం ఒక్కనాడు 166 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 58, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 57, జోగులాంబ గద్వాల జిల్లాలో 40, నారాయణపేట జిల్లాలో ఏడుగురు, వనపర్తి జిల్లాలో నలుగురు కొవిడ్ బారిన పడ్డారు. తాజా కేసులతో ఉమ్మడి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1736కు చేరింది.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో...

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో 32 మంది కరోనా బారిన పడగా.. పట్టణంలోని మర్లు, న్యూగంజ్‌లో ఒకే కుటుంబంలో నలుగురు చొప్పున కరోనాకు గురయ్యారు. జడ్చర్ల పట్టణంలో 16 మందికి పాజిటివ్‌ రాగా.. సీసీకుంట మండలంలో ఐదు మంది, భూత్పూర్​లోని కొత్త మొల్గరలో ఒకరికి కరోనా సోకింది.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో...

నాగర్‌కర్నూల్‌ పట్టణంలో 13, అచ్చంపేట మండలంలో 22, కల్వకుర్తి మండలంలో 9, అమ్రబాద్‌లోని ఈగలపెంటలో ఐదుగురికి కరోనా నిర్ధారణ అయింది. యెన్మన్‌బెట్లలో ముగ్గురు, కొల్లాపూర్‌, పెంట్లవెల్లి, బల్మూరు, బిజినేపల్లి, తిమ్మాజీపేటలో ఒక్కొక్కరు కొవిడ్‌ బారిన పడ్డారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో...

జోగులాబం గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే నలుగురు వైద్యులకు కరోనా సోకింది. పట్టణానికి చెందిన 16 మంది, గ్రామీణంలో మరో 6 మంది, ధరూర్‌లో ముగ్గురు, మల్దకల్‌‌లో ఒక్కరు చొప్పున కరోనాకు గురయ్యారు. అయిజలో ఆరుగురు, అలంపూర్‌లో నలుగురు, ఉండవల్లి, మానవపాడు మండలాల్లో ఇద్దరు చొప్పున కొవిడ్‌ కొవిడ్ బారిన పడ్డారు.

నారాయణపేట పట్టణంలో ముగ్గురు, మద్దూరులో ముగ్గురు, కొత్తపల్లిలో ఒకరు చొప్పున కరోనా బారిన పడగా... వనపర్తి జిల్లాలో.. నలుగురికి కరోనా మహమ్మారి సోకింది.

ఇవీ చూడండి: గేటెడ్‌ కమ్యూనిటీల్లో కరోనా చికిత్స

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. మంగళవారం ఒక్కనాడు 166 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 58, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 57, జోగులాంబ గద్వాల జిల్లాలో 40, నారాయణపేట జిల్లాలో ఏడుగురు, వనపర్తి జిల్లాలో నలుగురు కొవిడ్ బారిన పడ్డారు. తాజా కేసులతో ఉమ్మడి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1736కు చేరింది.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో...

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో 32 మంది కరోనా బారిన పడగా.. పట్టణంలోని మర్లు, న్యూగంజ్‌లో ఒకే కుటుంబంలో నలుగురు చొప్పున కరోనాకు గురయ్యారు. జడ్చర్ల పట్టణంలో 16 మందికి పాజిటివ్‌ రాగా.. సీసీకుంట మండలంలో ఐదు మంది, భూత్పూర్​లోని కొత్త మొల్గరలో ఒకరికి కరోనా సోకింది.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో...

నాగర్‌కర్నూల్‌ పట్టణంలో 13, అచ్చంపేట మండలంలో 22, కల్వకుర్తి మండలంలో 9, అమ్రబాద్‌లోని ఈగలపెంటలో ఐదుగురికి కరోనా నిర్ధారణ అయింది. యెన్మన్‌బెట్లలో ముగ్గురు, కొల్లాపూర్‌, పెంట్లవెల్లి, బల్మూరు, బిజినేపల్లి, తిమ్మాజీపేటలో ఒక్కొక్కరు కొవిడ్‌ బారిన పడ్డారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో...

జోగులాబం గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే నలుగురు వైద్యులకు కరోనా సోకింది. పట్టణానికి చెందిన 16 మంది, గ్రామీణంలో మరో 6 మంది, ధరూర్‌లో ముగ్గురు, మల్దకల్‌‌లో ఒక్కరు చొప్పున కరోనాకు గురయ్యారు. అయిజలో ఆరుగురు, అలంపూర్‌లో నలుగురు, ఉండవల్లి, మానవపాడు మండలాల్లో ఇద్దరు చొప్పున కొవిడ్‌ కొవిడ్ బారిన పడ్డారు.

నారాయణపేట పట్టణంలో ముగ్గురు, మద్దూరులో ముగ్గురు, కొత్తపల్లిలో ఒకరు చొప్పున కరోనా బారిన పడగా... వనపర్తి జిల్లాలో.. నలుగురికి కరోనా మహమ్మారి సోకింది.

ఇవీ చూడండి: గేటెడ్‌ కమ్యూనిటీల్లో కరోనా చికిత్స

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.