ETV Bharat / state

చదువులమ్మ ఒడిలో... 30 ఏళ్ల తర్వాత!

author img

By

Published : Jun 6, 2022, 4:22 PM IST

అందరూ కలిసి అక్కడ చదువుకున్నారు. ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. ఇప్పుడు మళ్లీ అందరూ కలిశారు. ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఇవి మహబూబ్​నగర్ జిల్లా కోయిల్​కొండ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిన్న జరిగిన పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో కనిపించిన దృశ్యాలు.

పూర్వవిద్యార్థుల సమ్మేళనం
పూర్వవిద్యార్థుల సమ్మేళనం

చదువులమ్మ చెట్టు నీడలో ఎదిగిన పూర్వ విద్యార్థులు 30 ఏళ్లకు మళ్లీ కలుసుకున్నారు. మహబూబ్​నగర్ జిల్లా కోయిల్​కొండ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1992-93 బ్యాచ్​ పదో తరగతి పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఒకరికొకరు అప్పటి మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకున్నారు. అంతా కలిసి తాము విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలకు రూ.30 వేల నగదును అందజేశారు. చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్న వారంతా.. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రోజంతా ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు.

ఇదీ చదవండి: తెలంగాణలో బోనాల జాతర.. ఎప్పటినుంచంటే..?!

చదువులమ్మ చెట్టు నీడలో ఎదిగిన పూర్వ విద్యార్థులు 30 ఏళ్లకు మళ్లీ కలుసుకున్నారు. మహబూబ్​నగర్ జిల్లా కోయిల్​కొండ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1992-93 బ్యాచ్​ పదో తరగతి పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఒకరికొకరు అప్పటి మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకున్నారు. అంతా కలిసి తాము విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలకు రూ.30 వేల నగదును అందజేశారు. చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్న వారంతా.. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రోజంతా ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు.

ఇదీ చదవండి: తెలంగాణలో బోనాల జాతర.. ఎప్పటినుంచంటే..?!

ఇకపై నెలకు 24 ట్రైన్ టికెట్లు బుక్​ చేసే వీలు.. కానీ ఓ షరతు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.