ETV Bharat / state

మహబూబాబాద్​లో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు - sarvepally radha krishna birth anniversary

స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్వేపల్లి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించిన భారత ఉపరాష్ట్రపతిగా సేవలందించిన మహనీయుడు సర్వేపల్లి అని ఎమ్మెల్యే శంకర్ నాయక్ కొనియాడారు.

sarvepally radha krishna birth anniversary in mahabubabad
మహబూబాబాద్​లో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు
author img

By

Published : Sep 5, 2020, 2:34 PM IST

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉపాధ్యాయులతో కలిసి ఎమ్మెల్యే శంకర్ నాయక్ సర్వేపల్లి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి.. భారత ఉపరాష్ట్రపతిగా సేవలందించి భారతరత్న అవార్డును అందుకున్న మహనీయుడు సర్వేపల్లి అని కొనియాడారు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్ది, సమాజ అభ్యున్నతిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉపాధ్యాయులతో కలిసి ఎమ్మెల్యే శంకర్ నాయక్ సర్వేపల్లి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి.. భారత ఉపరాష్ట్రపతిగా సేవలందించి భారతరత్న అవార్డును అందుకున్న మహనీయుడు సర్వేపల్లి అని కొనియాడారు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్ది, సమాజ అభ్యున్నతిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.