ETV Bharat / state

జిల్లాలో 80 రైతు వేదికలకు నిర్మాణం: కలెక్టర్​ గౌతమ్​

మహబూబాబాద్​ జిల్లాలో 80 రైతు వేదికలు నిర్మించనున్నట్లు కలెక్టర్​ పీవీ గౌతమ్​ పేర్కొన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే వేస్తూ రైతులు ఆర్థిక ప్రగతి సాధించడమే ప్రభుత్వ ఆశయమని కలెక్టర్ వివరించారు. సన్న రాకనికి మంచి రేటు పలుకుతుందని.. తినేందుకు కూడా ఎక్కువగా ఉపయోగిస్తామని రైతులు ఆ దిశగా ఆలోచించాలని డోర్నకల్​ ఎమ్మెల్యే రెడ్యా నాయక్​ కోరారు.

author img

By

Published : May 29, 2020, 10:57 PM IST

జిల్లాలో 80 రైతు వేదికలకు నిర్మాణం: కలెక్టర్​ గౌతమ్​
జిల్లాలో 80 రైతు వేదికలకు నిర్మాణం: కలెక్టర్​ గౌతమ్​

రైతులందరినీ సంఘటిత పరిచి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు జిల్లాలో 80 రైతు వేదికలు నిర్మించనున్నామని మహబూబాబాద్​ జిల్లా కలెక్టర్ పీవీ గౌతమ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండ ధర్మారం లో వానాకాలం 2020 సాగు నియంత్రణపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే వేస్తూ రైతులు ఆర్థిక ప్రగతి సాధించడమే ప్రభుత్వ ఆశయమని కలెక్టర్ వివరించారు. సన్న రకం వరితో పాటు మంచి డిమాండ్ ఉన్న పత్తి కంది సాగు చేసేందుకు రైతులు దృష్టి సారించాలని ఆయన సూచించారు.

సన్న రాకనికి మంచి రేటు పలుకుతుందని.. తినేందుకు కూడా ఎక్కువగా ఉపయోగిస్తామని రైతులు ఆ దిశగా ఆలోచించాలని డోర్నకల్​ ఎమ్మెల్యే రెడ్యా నాయక్​ కోరారు. జిల్లాలో కంది పంట 15 వేల ఎకరాల్లో వేసుకునే అవకాశం ఉందన్నారు. కంది కింటాకు రూ. 5, 500 ధర పలుకుతుందని రైతులకు వివరించారు.

ఇదీ చూడండి: చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు

రైతులందరినీ సంఘటిత పరిచి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు జిల్లాలో 80 రైతు వేదికలు నిర్మించనున్నామని మహబూబాబాద్​ జిల్లా కలెక్టర్ పీవీ గౌతమ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండ ధర్మారం లో వానాకాలం 2020 సాగు నియంత్రణపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే వేస్తూ రైతులు ఆర్థిక ప్రగతి సాధించడమే ప్రభుత్వ ఆశయమని కలెక్టర్ వివరించారు. సన్న రకం వరితో పాటు మంచి డిమాండ్ ఉన్న పత్తి కంది సాగు చేసేందుకు రైతులు దృష్టి సారించాలని ఆయన సూచించారు.

సన్న రాకనికి మంచి రేటు పలుకుతుందని.. తినేందుకు కూడా ఎక్కువగా ఉపయోగిస్తామని రైతులు ఆ దిశగా ఆలోచించాలని డోర్నకల్​ ఎమ్మెల్యే రెడ్యా నాయక్​ కోరారు. జిల్లాలో కంది పంట 15 వేల ఎకరాల్లో వేసుకునే అవకాశం ఉందన్నారు. కంది కింటాకు రూ. 5, 500 ధర పలుకుతుందని రైతులకు వివరించారు.

ఇదీ చూడండి: చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.