మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. కురవి, మరిపెడ, చిన్నగూడూరు, నరసింహులపేట, దంతాలపల్లి మండలాల్లో పోలియో టీకా కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు ప్రారంభించారు.
5 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత అని ప్రజాప్రతినిధులు అన్నారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా కృషి చేయాలని వైద్యాధికారులు కోరారు.
ఇదీ చదవండి: పిల్లలకు పోలియో చుక్కలు వేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్