ETV Bharat / state

ఆ పోస్టుల్లో అక్రమాలు జరిగాయని ఆందోళన

మహబూబాబాద్​ జిల్లా పంచాయతీ కార్యాలయం ఎదుట జూనియర్ పంచాయతీ సెక్రెటరీ అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. ఆ పోస్టుల నియామకాల్లో తక్కువ మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేశారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

author img

By

Published : Nov 13, 2020, 9:14 AM IST

junior panchayat secretary candidates protest at mahabubabad panchayat office
ఆ పోస్టుల్లో అక్రమాలు జరిగాయని ఆందోళన

జూనియర్ పంచాయతీ సెక్రెటరీ బ్యాక్​లాక్ పోస్టుల నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ.. అభ్యర్థులు మహబూబాబాద్​ జిల్లా పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మెరిట్ ఆధారంగా ఖాళీలు భర్తీ చేయకుండా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను కాకుండా.. తక్కువ మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేశారని.. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి నియమాకల ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై జిల్లా పంచాయతీ అధికారిణి వివరణ కోరగా.. కలెక్టర్ ఆదేశాల మేరకు రోస్టర్ పద్ధతిలో ఖాళీలను భర్తీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి నియామక ప్రక్రియకు సంబంధించిన విషయాలను ఆన్​లైన్​లో పొందుపరుస్తున్నామని వెల్లడించారు.

జూనియర్ పంచాయతీ సెక్రెటరీ బ్యాక్​లాక్ పోస్టుల నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ.. అభ్యర్థులు మహబూబాబాద్​ జిల్లా పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మెరిట్ ఆధారంగా ఖాళీలు భర్తీ చేయకుండా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను కాకుండా.. తక్కువ మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేశారని.. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి నియమాకల ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై జిల్లా పంచాయతీ అధికారిణి వివరణ కోరగా.. కలెక్టర్ ఆదేశాల మేరకు రోస్టర్ పద్ధతిలో ఖాళీలను భర్తీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి నియామక ప్రక్రియకు సంబంధించిన విషయాలను ఆన్​లైన్​లో పొందుపరుస్తున్నామని వెల్లడించారు.

ఇదీ చూడండి : కాజిపేటలో దారికోసం ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.