స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కిపులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శీత్లాతండాలో తీవ్ర ఉత్కంఠ మధ్య ఫలితం తేలింది. తెరాస అభ్యర్థిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాంకుడొత్ రోజా ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. తెరాస కార్యకర్తలు రీ పోలింగ్ కోరారు. అందులో కూడా కాంగ్రెస్నే విజయం వరించింది. ఇరుపార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల చొరవతో వివాదం సద్దుమణిగింది.
ఇదీ చదవండి: "నీళ్లు ఇవ్వలేదని కౌంటింగ్ ఆపేశారు"