మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామంలో ప్రమాదవశాత్తుగా 4 గడ్డి వాములు దగ్ధమై సుమారు 2 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. మరోచోట నెల్లికుదురు మండలం లక్ష్మీపురం గ్రామ శివారు కొత్త తండాలో విద్యుత్ షార్ట్ సర్కుట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 2 గుడిసెలు, 4 గడ్డివాములు, 1 ఎడ్లబండి దగ్ధమై 4 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. తండాకు చెందిన లూనవత్ సీతారాములు, లూనవత్ సురేశ్లకు చెందిన ఇళ్ళలోని వస్తువులు అన్ని కాలిపోయాయి. బాధితుల రోదన స్థానికులను కలిచివేసింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఇవీ చూడండి: అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్న కేసీఆర్