ETV Bharat / state

ఆ గ్రామంలో వివాదాలు ఉండవు.. పార్టీల జెండాలు కనపడవు! - మెట్లతిమ్మాపురం గ్రామం

బయ్యారం మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన గుట్టలు.. పచ్చని చెట్ల నడుమ ఉండే ఆదివాసీ గూడెం అది.. అక్కడి ప్రజల్లో కల్మషం, విద్వేషాలు ఏమాత్రం కనిపించవు. వివాదాలకు దూరంగా ఉంటూ పరస్పర సహకారంతో సమష్టిగా కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తున్నారు. ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన ఆ గూడెం ప్రజలు ఏనాడు పోలీసుస్టేషన్‌కు వెళ్లిన దాఖలాలు లేవు. మద్యనిషేధం అమలు చేస్తూ, సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నారు. ఇంటింటికి మరుగుదొడ్డిని నిర్మించుకొని స్వచ్ఛతలోనూ శెభాష్‌ అనిపించుకుంటున్నారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఆ ఊరే మహబూబాబాద్​ జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన మెట్లతిమ్మాపురం గ్రామం.

100 percent development in metla thimmapur village
ఆ గ్రామంలో వివాదాలు ఉండవు.. పార్టీల జెండాలు కనపడవు!
author img

By

Published : Dec 27, 2020, 2:51 PM IST

మహబూబాబాద్​ జిల్లా బయ్యారం మండలం మెట్ల తిమ్మాపురం గ్రామం స్వచ్ఛతకు మారుపేరుగానే కాకుండా అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడ నిరక్ష్యరాస్యులు ఉండరు. మద్యం సేవించేవారు ఉండరు.

పోలీస్‌స్టేషన్‌కు వెళ్లని పల్లె

గ్రామస్థులు ఎప్పుడు ఠాణా మెట్టెక్కిన దాఖాలు లేవు. వివాదాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. ఎలాంటి సమస్యలు వచ్చినా సర్పంచి, పటేల్‌, దొర గ్రామంలోని పెద్దలు, యువత, మహిళలతో చర్చించి గ్రామంలోనే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటారు. గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులున్నా ఎక్కడా ఏ పార్టీకి సంబంధించిన జెండాలు, స్తూపాలు విగ్రహాలు కాని కనిపించవు.

ఆర్థికంగా చితికిపోతున్నామనే..

పదేళ్ల కిందట ఓ కిరాణ దుకాణంలో మద్యం అమ్మేవారు. దానికి అలవాటు పడి పనులు చేయకుండా ఇంటిపట్టునే ఉండటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడం, కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. ఈ నష్టాన్ని గ్రహించిన పల్లెవాసులు గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయాలని తీర్మానించారు. ఎవరూ గుడుంబా తయారు చేయవద్దని.. కాదన్నవారికి జరిమానాలు విధించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇంత నిక్కచ్చిగా ఉండబట్టే పదేళ్లుగా ఇక్కడ గుడుంబా తయారీ, మద్యం అమ్మకాలు, గొలుసుకట్టు దుకాణాలు పూర్తిగా బంద్‌ అయ్యాయి. మొదట్లో కొంతమంది మద్యం అమ్మకాలు చేపట్టినా వారికి విధించిన జరిమానాలతో గ్రామాభివృద్ధికి ఖర్చు చేశారు. ఇంత ఆదర్శంగా ఉంటున్న తమ గ్రామానికి వట్టెవాగుకు వరదలొస్తే రాకపోకలు నిలిచిపోతున్నాయని.. అధికారులు వంతెన నిర్మించాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.

village
ఇంటింటికీ ఇలా శౌచాలయం

మొదట్లో ఒకే వంశం..

క్రమశిక్షణ కలిగిన ఊరుగా పేరొందిన ఈ గూడెంలో పూర్తిగా ఆదివాసీ కుటుంబాలే జీవనం సాగిస్తున్నాయి. మొదట ఇక్కడ ఒకే వంశానికి చెందిన కుటుంబాలుండేవి. తరువాత ఆ పల్లె పెద్దలను ఒప్పించి మరికొన్ని కుటుంబాలు స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాయి. ప్రస్తుతం 140 కుటుంబాల్లో 556 మంది జనాభా ఉన్నారు. పూర్తిగా వ్యవసాయమే వీరి జీవనాధారం. ప్రతి కుటుంబానికి సుమారు అయిదు ఎకరాల వరకు సాగుభూమి ఉంటుంది.

అక్షరాస్యత దిశగా..

చదువు అవసరాన్ని గుర్తించిన గ్రామస్థులు పదేళ్ల కిందట ప్రతి ఒక్కరూ అక్షరాలు నేర్చుకుని 2005లో అనాటి ఐటీడీఏ పీవోతో ప్రశంసలు పొందారు. 15మంది ప్రభుత్వ ఉద్యోగులు, 14 మంది పీజీ, 20మంది బీఈడీ పూర్తిచేసిన యువత ఉన్నారు. బడికి సమయానికి ఉపాధ్యాయులు రాకుంటే ప్రజలే వెళ్లి ప్రశ్నిస్తారు. ఆలస్యానికి కారణాలు తెలుసుకుంటారు. ఏఎన్‌ఎం కూడా సకాలంలో రాకుంటే ప్రశ్నిస్తారు. గ్రామసమీపంలోని అడవి నుంచి అక్రమ కలప వ్యాపారం జరగకుండా వీరే అడ్డుకుంటారు.

ప్రతి ఒక్కరు సంతకం చేస్తారు..

మా గ్రామంలో ప్రతి ఒక్కరికి చదువు వచ్ఛు ప్రతి ఒక్కరూ సంతకం చేస్తారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణాలు చేయించాం. మద్యం అమ్మకాలు లేవు. అమ్మితే జరిమానాలు విధిస్తున్నాం.

- స్వరూప, సర్పంచి, మెట్లతిమ్మాపురం

మహబూబాబాద్​ జిల్లా బయ్యారం మండలం మెట్ల తిమ్మాపురం గ్రామం స్వచ్ఛతకు మారుపేరుగానే కాకుండా అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడ నిరక్ష్యరాస్యులు ఉండరు. మద్యం సేవించేవారు ఉండరు.

పోలీస్‌స్టేషన్‌కు వెళ్లని పల్లె

గ్రామస్థులు ఎప్పుడు ఠాణా మెట్టెక్కిన దాఖాలు లేవు. వివాదాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. ఎలాంటి సమస్యలు వచ్చినా సర్పంచి, పటేల్‌, దొర గ్రామంలోని పెద్దలు, యువత, మహిళలతో చర్చించి గ్రామంలోనే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటారు. గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులున్నా ఎక్కడా ఏ పార్టీకి సంబంధించిన జెండాలు, స్తూపాలు విగ్రహాలు కాని కనిపించవు.

ఆర్థికంగా చితికిపోతున్నామనే..

పదేళ్ల కిందట ఓ కిరాణ దుకాణంలో మద్యం అమ్మేవారు. దానికి అలవాటు పడి పనులు చేయకుండా ఇంటిపట్టునే ఉండటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడం, కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. ఈ నష్టాన్ని గ్రహించిన పల్లెవాసులు గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయాలని తీర్మానించారు. ఎవరూ గుడుంబా తయారు చేయవద్దని.. కాదన్నవారికి జరిమానాలు విధించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇంత నిక్కచ్చిగా ఉండబట్టే పదేళ్లుగా ఇక్కడ గుడుంబా తయారీ, మద్యం అమ్మకాలు, గొలుసుకట్టు దుకాణాలు పూర్తిగా బంద్‌ అయ్యాయి. మొదట్లో కొంతమంది మద్యం అమ్మకాలు చేపట్టినా వారికి విధించిన జరిమానాలతో గ్రామాభివృద్ధికి ఖర్చు చేశారు. ఇంత ఆదర్శంగా ఉంటున్న తమ గ్రామానికి వట్టెవాగుకు వరదలొస్తే రాకపోకలు నిలిచిపోతున్నాయని.. అధికారులు వంతెన నిర్మించాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.

village
ఇంటింటికీ ఇలా శౌచాలయం

మొదట్లో ఒకే వంశం..

క్రమశిక్షణ కలిగిన ఊరుగా పేరొందిన ఈ గూడెంలో పూర్తిగా ఆదివాసీ కుటుంబాలే జీవనం సాగిస్తున్నాయి. మొదట ఇక్కడ ఒకే వంశానికి చెందిన కుటుంబాలుండేవి. తరువాత ఆ పల్లె పెద్దలను ఒప్పించి మరికొన్ని కుటుంబాలు స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాయి. ప్రస్తుతం 140 కుటుంబాల్లో 556 మంది జనాభా ఉన్నారు. పూర్తిగా వ్యవసాయమే వీరి జీవనాధారం. ప్రతి కుటుంబానికి సుమారు అయిదు ఎకరాల వరకు సాగుభూమి ఉంటుంది.

అక్షరాస్యత దిశగా..

చదువు అవసరాన్ని గుర్తించిన గ్రామస్థులు పదేళ్ల కిందట ప్రతి ఒక్కరూ అక్షరాలు నేర్చుకుని 2005లో అనాటి ఐటీడీఏ పీవోతో ప్రశంసలు పొందారు. 15మంది ప్రభుత్వ ఉద్యోగులు, 14 మంది పీజీ, 20మంది బీఈడీ పూర్తిచేసిన యువత ఉన్నారు. బడికి సమయానికి ఉపాధ్యాయులు రాకుంటే ప్రజలే వెళ్లి ప్రశ్నిస్తారు. ఆలస్యానికి కారణాలు తెలుసుకుంటారు. ఏఎన్‌ఎం కూడా సకాలంలో రాకుంటే ప్రశ్నిస్తారు. గ్రామసమీపంలోని అడవి నుంచి అక్రమ కలప వ్యాపారం జరగకుండా వీరే అడ్డుకుంటారు.

ప్రతి ఒక్కరు సంతకం చేస్తారు..

మా గ్రామంలో ప్రతి ఒక్కరికి చదువు వచ్ఛు ప్రతి ఒక్కరూ సంతకం చేస్తారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణాలు చేయించాం. మద్యం అమ్మకాలు లేవు. అమ్మితే జరిమానాలు విధిస్తున్నాం.

- స్వరూప, సర్పంచి, మెట్లతిమ్మాపురం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.