కుమురం భీం జిల్లా కాగజ్నగర్ మండలం ఆరెగూడలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన సంతోష్ అనుమానంతో భార్యను గొడ్డలితో చంపేశాడని గ్రామీణ సీఐ నరేందర్ తెలిపారు. అయితే నిందితుడికి, మృతురాలికి తరచూ గొడవలు జరిగేవని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి ఘర్షణ పెద్దదవడం వల్ల హత్య చేశాడని స్పష్టం చేశారు.
మృతురాలి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేందర్ వెల్లడించారు. ఈ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఏం చేయాలంటే..