ETV Bharat / state

థర్మాకోల్​ పడవల్లో ప్రమాదకర ప్రయాణం

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి గుండి గ్రామానికి ఆసిఫాబాద్​కు మధ్యలో పెద్దవాగు వర్షానికి పొంగి పొర్లుతోంది. వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో.... స్థానికులు, విద్యార్థులు థర్మాకోల్​తో తయారు చేసిన నాటు పడవల్లో ప్రమాదకర పరిస్థితుల్లో వాగు దాటుతున్నారు.

author img

By

Published : Aug 9, 2019, 10:23 AM IST

Updated : Aug 9, 2019, 11:47 AM IST

థర్మాకోల్​ పడవల్లో ప్రమాదకర ప్రయాణం

థర్మాకోల్​తో తయారు చేసిన నాటు పడవల్లో ప్రమాదకరంగా వాగును దాటుతున్న వీరు కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా గుండి గ్రామానికి చెందిన విద్యార్థులు. ఆసిఫాబాద్​కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం నుంచి నిత్యం జిల్లా కేంద్రానికి ప్రజలు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. కుమురం భీం ప్రాజెక్టు నీళ్లతో పాటు ఇతర నదులను కలుపుకొని వచ్చే పెద్దవాగు ఇటీవల వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నీటి ప్రవాహంలోనే నలుగురు వ్యక్తులు థర్మాకోల్ సహాయంతో పిల్లలను, ప్రజలను ఎక్కించుకుని ప్రవాహ వేగానికి అనుగుణంగా తోస్తూ ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు చేరుతున్నారు. ఏ మాత్రం పట్టు తప్పినా నీటిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది.

ఈ వంతెనకు 2012లో మూడు కోట్లతో టెండర్లు పిలిచి తర్వాత 11 కోట్లకు పెంచారు. అయినప్పటికీ నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇప్పటికైనా పాలకులు అధికారులు పట్టించుకొని వంతెన పూర్తిచేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

థర్మాకోల్​ పడవల్లో ప్రమాదకర ప్రయాణం

ఇదీ చూడండి : బాబాపూర్​లో ఈత మొక్కలు నాటిన కలెక్టర్​

థర్మాకోల్​తో తయారు చేసిన నాటు పడవల్లో ప్రమాదకరంగా వాగును దాటుతున్న వీరు కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా గుండి గ్రామానికి చెందిన విద్యార్థులు. ఆసిఫాబాద్​కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం నుంచి నిత్యం జిల్లా కేంద్రానికి ప్రజలు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. కుమురం భీం ప్రాజెక్టు నీళ్లతో పాటు ఇతర నదులను కలుపుకొని వచ్చే పెద్దవాగు ఇటీవల వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నీటి ప్రవాహంలోనే నలుగురు వ్యక్తులు థర్మాకోల్ సహాయంతో పిల్లలను, ప్రజలను ఎక్కించుకుని ప్రవాహ వేగానికి అనుగుణంగా తోస్తూ ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు చేరుతున్నారు. ఏ మాత్రం పట్టు తప్పినా నీటిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది.

ఈ వంతెనకు 2012లో మూడు కోట్లతో టెండర్లు పిలిచి తర్వాత 11 కోట్లకు పెంచారు. అయినప్పటికీ నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇప్పటికైనా పాలకులు అధికారులు పట్టించుకొని వంతెన పూర్తిచేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

థర్మాకోల్​ పడవల్లో ప్రమాదకర ప్రయాణం

ఇదీ చూడండి : బాబాపూర్​లో ఈత మొక్కలు నాటిన కలెక్టర్​

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి గ్రామానికి ఆసిఫాబాద్ కు మధ్యలో పెద్ద వాగు ఉన్నది ఈ వాగు పొంగిపొర్లడంతో గ్రామ ప్రజలు విద్యార్థులు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ వంతెనకు 2012లో 3 కోట్లతో టెండర్లు పిలిచి తర్వాత 11 కోట్లకు పెంచారు అయినప్పటికీ ఈ వంతెన ఇప్పటికీ పూర్తి కాలేదు గుత్తేదారులు పనులు పూర్తి చేయలేదు

ధర్మకోల్ తో తయారు చేసిన నాటు పడవల్లో ప్రమాదకరంగా వాగును దాటుతున్న వీరు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుండి గ్రామానికి చెందిన విద్యార్థులు ఆసిఫాబాద్ కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం నుంచి నిత్యం జిల్లా కేంద్రానికి విద్యార్థులు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు కొమరం భీమ్ ప్రాజెక్టు నీళ్లతో పాటు ఇతర నదులను కలుపుకొని వచ్చే పెద్దవాగు ఇటీవల వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తుంది ఈ నీటి ప్రవాహం లోనే నలుగురు ధర్మకోల్ పడవ చుట్టూ ఉంటూ పిల్లలను ప్రజలను ఎక్కించుకుని ప్రవాహ వేగానికి అనుగుణంగా పడవలు తోస్తు ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకు చేరుతున్నారు ఈ క్రమంలో ఏ మాత్రం పట్టు తప్పిన నీటిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నది విద్యార్థులతోపాటు గ్రామస్థులు సైతం ఈ విధంగానే వాగు దాటుతున్నారు వాగుకు కు చేరే దారిలో నడుము లోతు వరకు ఉన్న నీళ్ళలో మరో రెండు పాయలను దాటాల్సి ఉంటుంది పుష్కరకాలంగా పూర్తికాని వంతెన వల్ల ఏటా వర్షాకాలంలో ఇక్కడి ప్రజలు వాగు దాటేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది ఇంకా ఎక్కువగా వాగు వచ్చినట్లయితే 25 కిలోమీటర్ల దూరం నుండి తిరిగి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకొని ప్రజల పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళతారు ఇప్పటికైనా పాలకులు అధికారులు పట్టించుకోని వంతెన పూర్తిచేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు తరాలు మారినా తలరాతలు మాత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాలకులు మారిన పాలన మారదా లేదు అని వాపోతున్నారు

జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా

Body:Tg_adb_25_09_praanalu_pananga_petti_vaagu_datuthunna_prajalu_vidyarthulu_avb_ts10078Conclusion:
Last Updated : Aug 9, 2019, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.