ETV Bharat / state

'పులి దాడి' బాధిత కుటుంబాలను పరామర్శించిన అల్లోల - tiger attack updates in kumaram bheem

ఇటీవల పులి దాడిలో మరణించిన నిర్మల, విగ్నేష్​ల కుటుంబాలను రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పీసీసీఎఫ్ఆర్ శోభ పరామర్శించారు. పులి దాడిలో పిల్లల్ని కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అటవీ శాఖ తరఫున 5 లక్షల నగదు అందజేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

minister allola indrakaran reddy visited the families of the tiger attack victims in kumaram bheem
పులి దాడి బాధిత కుటుంబాలను పరామర్శించిన అల్లోల
author img

By

Published : Dec 7, 2020, 4:32 PM IST

Updated : Dec 7, 2020, 5:49 PM IST

కుమురం భీం జిల్లా పెంచికలపేట మండలం కొండపల్లిలో ఇటీవల పులి దాడిలో మరణించిన పసుల నిర్మల, విగ్నేష్​ల కుటుంబాల్ని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. మంత్రితోపాటు పీసీసీఎఫ్ఆర్ శోభ, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కోవ లక్ష్మి, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప బాలిక తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పారు. దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నష్టపరిహారం రూ. 5 లక్షలు అందించామని.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మరింత సహాయం అందేలా కృషి చేస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్​రూమ్​ ఇల్లు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్​ను ఆదేశించారు. అనంతరం ఘటనాస్థలిని సందర్శించారు. పత్తి చేలల్లో పులి దాడి చేసిన తీరును అటవీ శాఖ సిబ్బంది మంత్రికి తెలిపారు.

కుమురం భీం జిల్లాలో పులి ఇద్దరిపై దాడి చేసి హతమార్చిన విషయం విదితమే. గత నెల 11న దహేగాం మండలం దిగిడ అటవీ ప్రాంతంలో విగ్నేష్​ను హతమార్చగా.. 29న పెంచికలపేట మండలం కొండపల్లిలో నిర్మలపై దాడి చేసి చంపేసింది. స్వల్ప వ్యవధిలో పులి ఇద్దరిని పొట్టనబెట్టుకోవడంతో సమీప గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మరో వైపు పులిని బంధించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇదీ చూడండి: రైతుబంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

కుమురం భీం జిల్లా పెంచికలపేట మండలం కొండపల్లిలో ఇటీవల పులి దాడిలో మరణించిన పసుల నిర్మల, విగ్నేష్​ల కుటుంబాల్ని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. మంత్రితోపాటు పీసీసీఎఫ్ఆర్ శోభ, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కోవ లక్ష్మి, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప బాలిక తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పారు. దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నష్టపరిహారం రూ. 5 లక్షలు అందించామని.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మరింత సహాయం అందేలా కృషి చేస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్​రూమ్​ ఇల్లు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్​ను ఆదేశించారు. అనంతరం ఘటనాస్థలిని సందర్శించారు. పత్తి చేలల్లో పులి దాడి చేసిన తీరును అటవీ శాఖ సిబ్బంది మంత్రికి తెలిపారు.

కుమురం భీం జిల్లాలో పులి ఇద్దరిపై దాడి చేసి హతమార్చిన విషయం విదితమే. గత నెల 11న దహేగాం మండలం దిగిడ అటవీ ప్రాంతంలో విగ్నేష్​ను హతమార్చగా.. 29న పెంచికలపేట మండలం కొండపల్లిలో నిర్మలపై దాడి చేసి చంపేసింది. స్వల్ప వ్యవధిలో పులి ఇద్దరిని పొట్టనబెట్టుకోవడంతో సమీప గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మరో వైపు పులిని బంధించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇదీ చూడండి: రైతుబంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

Last Updated : Dec 7, 2020, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.