కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఇస్గాం శివ మల్లన్న స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు చేశారు. షష్టి బోనాల పండుగ ముగిసిన సందర్భంగా ప్రత్యేక అధికారి ముక్త రవి పర్యవేక్షణలో ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ లెక్కింపులో... రెండు లక్షల 19 వేల 515 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వామన్ రావు, ఆలయ కమిటీ ఛైర్మన్ ఇందారపు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రపతి తేనీటి విందు... గవర్నర్,సీఎం సహా ప్రముఖుల హాజరు