కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం ఇస్గాం శివ మల్లన్న స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు ఆలయ అధికారులు. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో 20 హుండీలను ఏర్పాటు చేశారు.
ఈ రోజు ఉదయం ఆలయ అధికారులు, కమిటీ సభ్యుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో గ్రామంలోని విద్యార్థులు కూడా పాల్గొని డబ్బులు లెక్కపెట్టారు. ఉత్సవాల సందర్భంగా ఆలయానికి నగదు రూపంలో 4 లక్షల 5 వేల 164 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వామన్ రావు తెలిపారు.
ఇవీ చూడండి: పసివాడి శరీరంలో 12 సూదులు.. ఎలా తట్టుకున్నాడో పాపం.!