కుమురం భీం జిల్లా కాగజ్నగర్లో గుడుంబా తయారీకి ఉపయోగించే 12,200 కిలోల బెల్లం, 2800 కేజీల పటికను ఆబ్కారీ అధికారులు పట్టుకున్నారు. రెండు రోజుల క్రితం పట్టణంలోని కీర్తి ట్రేడర్స్కు బెల్లం లోడ్తో వచ్చిన లారీని మొదట ఎక్సైజ్ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. అనంతరం కీర్తి ట్రేడర్స్ గోదాములు తనిఖీ చేసేందుకు వెళ్లారు. అందుకు యజమాని పంకజ్ అగర్వాల్ అంగీకరించలేదు. తిరిగి రెవెన్యూ, పోలీస్ అధికారులతో కలిసి గోదాముల్లో సోదా చేయగా 12,200 కిలోల బెల్లం, 2800 కేజీల పటికి లభ్యమైంది. వీటిని స్వాధీనం చేసుకుని.. యజమాని పంకజ్ అగర్వాల్పై కేసు నమోదు చేసినట్లు ఆబ్కారీ సీఐ మహేందర్ సింగ్ తెలిపారు.
ఇదీ చదవండి: సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్ఫోర్స్ కమిటీ లేఖ