ETV Bharat / state

ఆసిఫాబాద్​లో కరోనా పాజిటివ్... యంత్రాంగం అప్రమత్తం - జిల్లా కేంద్రంలో కరోనా పాజిటివ్... అప్రమత్తమైన యంత్రాంగం

ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడాలేని కుమురం భీం జిల్లాలో ఓ కేసు నమోదైయింది. జిల్లా కేంద్రంలో ఓ యువకుడికి కరోనా వైరస్‌ సోకడంతో అప్రమత్తమైన జిల్లా యాంత్రాంగ నివారణ చర్యలను ముమ్మరం చేసింది.

first covid case registered in komaram bheem asifabad district headquarters
జిల్లా కేంద్రంలో కరోనా పాజిటివ్... అప్రమత్తమైన యంత్రాంగం
author img

By

Published : Jul 1, 2020, 2:28 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​లో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పాజిటివ్‌గా వచ్చిన యువకుడు ఉండే ఆ కాలనీ వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అగ్నిమాపక సిబ్బంది హైడ్రోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. అతనితో సన్నిహితంగా తిరిగిన 19 మందిని గుర్తించి క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. ఆ యువకుని ద్వారా ప్రైమరీ కాంటాక్ట్ గురించి ఆరా తీసున్నారు.

పట్టణంలోని వ్యాపారస్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. జిల్లా కేంద్రంలో మొదటి కొవిడ్‌ కేసు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

కుమురం భీం ఆసిఫాబాద్​లో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పాజిటివ్‌గా వచ్చిన యువకుడు ఉండే ఆ కాలనీ వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అగ్నిమాపక సిబ్బంది హైడ్రోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. అతనితో సన్నిహితంగా తిరిగిన 19 మందిని గుర్తించి క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. ఆ యువకుని ద్వారా ప్రైమరీ కాంటాక్ట్ గురించి ఆరా తీసున్నారు.

పట్టణంలోని వ్యాపారస్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. జిల్లా కేంద్రంలో మొదటి కొవిడ్‌ కేసు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఇదీ చూడండి: అడవుల పెంపు లక్ష్యంగా.. పాలమూరులో కోటి సీడ్‌బాల్స్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.