కుమురం భీం ఆసిఫాబాద్లో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పాజిటివ్గా వచ్చిన యువకుడు ఉండే ఆ కాలనీ వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అగ్నిమాపక సిబ్బంది హైడ్రోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. అతనితో సన్నిహితంగా తిరిగిన 19 మందిని గుర్తించి క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. ఆ యువకుని ద్వారా ప్రైమరీ కాంటాక్ట్ గురించి ఆరా తీసున్నారు.
పట్టణంలోని వ్యాపారస్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. జిల్లా కేంద్రంలో మొదటి కొవిడ్ కేసు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదీ చూడండి: అడవుల పెంపు లక్ష్యంగా.. పాలమూరులో కోటి సీడ్బాల్స్