ETV Bharat / state

మైక్రో ఆర్ట్​లో రాణిస్తున్న రేజర్ల యువకుడు

author img

By

Published : Aug 12, 2019, 1:12 PM IST

సరదాగా వేసిన బొమ్మలు ఆ యువకునిలో ఉన్న కళాకారుడిని నిద్రలేపాయి. ఇంకా ఏదో చేయాలన్న తపన అతన్ని నిద్రపోనివ్వలేదు. మొదట చాక్​ పీస్​పై నచ్చిన ఆకారం గీసి... అనంతరం పెన్సిల్​ మొనపై చిత్రాలు చెక్కడం ప్రారంభించాడు. మైక్రో ఆర్టిస్ట్​గా మారి అద్భుతమైన చిత్రాలు చెక్కి... అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అతనే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్లకు చెందిన గౌరీ శంకర్​.

మైక్రో ఆర్టిస్ట్​
మైక్రో ఆర్ట్​లో గ్రామీణ యువకుని ప్రతిభ

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామానికి చెందిన గుమ్మడిదల శివ, నవలోక దంపతుల కుమారుడు గౌరీ శంకర్. చిన్ననాటి నుంచి చిత్రకళపై మక్కువ పెంచుకున్నాడు. పాఠశాల స్థాయిలోనే అనేత చిత్రాలు గీసి బహుమతులు అందుకున్నాడు. పేపర్​ మీద పెన్సిల్​తో వేసే చిత్రాలు అతనికి సంతృప్తినివ్వలేదు. అందరిలో ఒకడిలా కాకుండా... తనకంటూ ఒక గుర్తింపు రావాలనే లక్ష్యాన్ని ఏర్పర్చుకున్నాడు. చైనాకు చెందిన మైక్రో ఆర్టిస్ట్​ చిన్​చాన్​ను ఆదర్శంగా తీసుకుని మొదటి చాక్​ పీస్​లపై చిత్రాలు చెక్కడం ప్రారంభించాడు. అనంతరం ఎంతో కష్టతరమైన పెన్సిల్​ మొనపై సున్నితమైన చిత్రాలు రూపొందించి ఔరా అనిపిస్తున్నాడు.

సూర్యకాంతి వెలుగులో...

సాధారణంగా మైక్రో ఆర్ట్​ చేసేవారు ప్రత్యేకంగా మైక్రో లెన్స్​ను ఉపయోగిస్తారు. గౌరీ శంకర్​ దీనికి భిన్నంగా సూర్యకాంతి వెలుగులోనే చిత్రాలను చేస్తాడు. ఇలా కేవలం రెండు మూడు గంటల్లోనే పెన్సిల్​పై చిత్రాలను పూర్తి చేయడం మరో విశేషం. ఈ మైక్రో ఆర్టిస్ట్​ సృజనాత్మకతతో చేసే బొమ్మలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి.

సాధించిన విజయాలు...

గౌరీ శంకర్​ ఇప్పటివరకు పెన్సిల్​పై చిత్రాలు చెక్కి... అనేక రికార్డులను సొంతం చేసుకున్నాడు. తెలంగాణ అనే పదాన్ని 15 భాషల్లో చెక్కి తెలుగు బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించుకున్నాడు. పాకిస్థాన్​కు చెందిన అబ్దుల్​ బషీర్​ పెన్సిల్​ మొనపై 50 లింకులతో గొలుసు తయారు చేసి గిన్నిస్​ బుక్​లో చోటు సాధించగా... గౌరీశంకర్​ 54 లింకులతో గొలుసు తయారుచేశాడు. దీనిని గిన్నిస్​ బుక్​లో రికార్డు కోసం దరఖాస్తు చేయగా అక్టోబర్​ 2న తన ఆర్ట్ పరిశీలించేందుకు వారు అవకాశం కల్పించారు.

ప్రభుత్వం ఆర్థికంగా ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తానంటున్నాడు ఈ మైక్రో ఆర్టిస్ట్​. పేద కుటుంబంలో పుట్టి పెన్సిల్​పై చిత్రాలు చెక్కడంలో చక్కటి ప్రతిభ కనబరుస్తున్న గౌరీ శంకర్​ ఆశయం నెరవేరాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.

ఇదీ చూడండి : కోలాటం: ఆహ్లాదం.. ఆధ్యాత్మిక అనుభూతి..

మైక్రో ఆర్ట్​లో గ్రామీణ యువకుని ప్రతిభ

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామానికి చెందిన గుమ్మడిదల శివ, నవలోక దంపతుల కుమారుడు గౌరీ శంకర్. చిన్ననాటి నుంచి చిత్రకళపై మక్కువ పెంచుకున్నాడు. పాఠశాల స్థాయిలోనే అనేత చిత్రాలు గీసి బహుమతులు అందుకున్నాడు. పేపర్​ మీద పెన్సిల్​తో వేసే చిత్రాలు అతనికి సంతృప్తినివ్వలేదు. అందరిలో ఒకడిలా కాకుండా... తనకంటూ ఒక గుర్తింపు రావాలనే లక్ష్యాన్ని ఏర్పర్చుకున్నాడు. చైనాకు చెందిన మైక్రో ఆర్టిస్ట్​ చిన్​చాన్​ను ఆదర్శంగా తీసుకుని మొదటి చాక్​ పీస్​లపై చిత్రాలు చెక్కడం ప్రారంభించాడు. అనంతరం ఎంతో కష్టతరమైన పెన్సిల్​ మొనపై సున్నితమైన చిత్రాలు రూపొందించి ఔరా అనిపిస్తున్నాడు.

సూర్యకాంతి వెలుగులో...

సాధారణంగా మైక్రో ఆర్ట్​ చేసేవారు ప్రత్యేకంగా మైక్రో లెన్స్​ను ఉపయోగిస్తారు. గౌరీ శంకర్​ దీనికి భిన్నంగా సూర్యకాంతి వెలుగులోనే చిత్రాలను చేస్తాడు. ఇలా కేవలం రెండు మూడు గంటల్లోనే పెన్సిల్​పై చిత్రాలను పూర్తి చేయడం మరో విశేషం. ఈ మైక్రో ఆర్టిస్ట్​ సృజనాత్మకతతో చేసే బొమ్మలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి.

సాధించిన విజయాలు...

గౌరీ శంకర్​ ఇప్పటివరకు పెన్సిల్​పై చిత్రాలు చెక్కి... అనేక రికార్డులను సొంతం చేసుకున్నాడు. తెలంగాణ అనే పదాన్ని 15 భాషల్లో చెక్కి తెలుగు బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించుకున్నాడు. పాకిస్థాన్​కు చెందిన అబ్దుల్​ బషీర్​ పెన్సిల్​ మొనపై 50 లింకులతో గొలుసు తయారు చేసి గిన్నిస్​ బుక్​లో చోటు సాధించగా... గౌరీశంకర్​ 54 లింకులతో గొలుసు తయారుచేశాడు. దీనిని గిన్నిస్​ బుక్​లో రికార్డు కోసం దరఖాస్తు చేయగా అక్టోబర్​ 2న తన ఆర్ట్ పరిశీలించేందుకు వారు అవకాశం కల్పించారు.

ప్రభుత్వం ఆర్థికంగా ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తానంటున్నాడు ఈ మైక్రో ఆర్టిస్ట్​. పేద కుటుంబంలో పుట్టి పెన్సిల్​పై చిత్రాలు చెక్కడంలో చక్కటి ప్రతిభ కనబరుస్తున్న గౌరీ శంకర్​ ఆశయం నెరవేరాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.

ఇదీ చూడండి : కోలాటం: ఆహ్లాదం.. ఆధ్యాత్మిక అనుభూతి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.