ఖమ్మం నగరంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ కంటైనర్లో బిస్కెట్ ప్యాకెట్ డబ్బాల మధ్య ఉంచి తరలిస్తున్న గంజాయిని పోలీసులు గుర్తించారు. పట్టుకోవడానికి ప్రయత్నించగా.. డ్రైవర్ వాహనంతో సహా పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు వాహనాన్ని సినీఫక్కీలో ఛేజ్ చేసి పట్టుకున్నారు.
కంటైనర్లో సుమారు 300 కిలోల గంజాయి ఉన్నట్లు తెలిపారు. ఇంత భారీ మొత్తంలో గంజాయి పట్టుకోవడం ఇదే ప్రథమమని పోలీసులు వెల్లడించారు. గంజాయి తరలిస్తున్న మరో కంటైనర్ పరారీలో ఉన్నట్లు సమాచారం.