ETV Bharat / state

కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి: పువ్వాడ - carona latest news in Telangana

కరోనా కట్టడికి ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైన తర్వాత అధికారులు పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టారని తెలిపారు.

Minister puvvada ajay kumar latest news
Minister puvvada ajay kumar latest news
author img

By

Published : Apr 7, 2020, 1:49 PM IST

Updated : Apr 7, 2020, 4:43 PM IST

ఖమ్మం జిల్లాలో ఎవరికైన కరోనా లక్షణాలు ఉంటే వెంటనే డీఎంహెచ్‌వో దృష్టికి తీసుకురావాలని మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ సూచించారు. ఖమ్మం గ్రామీణ మండలానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కావడం వల్ల జిల్లాలోని పరిస్థితులపై కలెక్టర్ కర్ణన్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, ఇతర వైద్యాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. పాజిటివ్ కేసు నమోదైన గ్రామాన్ని పూర్తిగా లాక్​డౌన్ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

కరోనా సోకిన వ్యక్తి ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారు... ఎవరిని కలిశారు అన్న వివరాలు అధికారులు సేకరిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మొత్తం 45 మందిని క్వారంటైన్​కు తరలించినట్లు చెప్పారు. దిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

లాక్​డౌన్ మొదలైన తర్వాత జిల్లాలో తొలి కేసు నమోదైనప్పటికీ.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా సేఫ్​గా ఉందని... ప్రజలంతా చైతన్యంతో ఉండి కరోనాను ఎదుర్కోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజలెవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని స్వీయ నియంత్రణ పాటించి ఇళ్లలోనే ఉండాలని సూచించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేయాలని సీపీని ఆదేశించినట్లు అజయ్​ కుమార్​ వెల్లడించారు.

ఖమ్మం జిల్లాలో ఎవరికైన కరోనా లక్షణాలు ఉంటే వెంటనే డీఎంహెచ్‌వో దృష్టికి తీసుకురావాలని మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ సూచించారు. ఖమ్మం గ్రామీణ మండలానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కావడం వల్ల జిల్లాలోని పరిస్థితులపై కలెక్టర్ కర్ణన్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, ఇతర వైద్యాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. పాజిటివ్ కేసు నమోదైన గ్రామాన్ని పూర్తిగా లాక్​డౌన్ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

కరోనా సోకిన వ్యక్తి ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారు... ఎవరిని కలిశారు అన్న వివరాలు అధికారులు సేకరిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మొత్తం 45 మందిని క్వారంటైన్​కు తరలించినట్లు చెప్పారు. దిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

లాక్​డౌన్ మొదలైన తర్వాత జిల్లాలో తొలి కేసు నమోదైనప్పటికీ.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా సేఫ్​గా ఉందని... ప్రజలంతా చైతన్యంతో ఉండి కరోనాను ఎదుర్కోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజలెవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని స్వీయ నియంత్రణ పాటించి ఇళ్లలోనే ఉండాలని సూచించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేయాలని సీపీని ఆదేశించినట్లు అజయ్​ కుమార్​ వెల్లడించారు.

Last Updated : Apr 7, 2020, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.