ETV Bharat / state

బొగ్గు కోసం బాంబు పేలుళ్లు.. భయాందోళనలో కాలనీ ప్రజలు!

author img

By

Published : Sep 20, 2020, 10:51 PM IST

అందరికి పక్షుల కిలకిలలు, కోకిల రాగాలతో తెల్లవారితే.. వారికి మాత్రం బాంబుల మోతలు.. ఊడిపడిన పెచ్చులతో ఉదయం స్వాగతం పలుకుతోంది. తెల్లవారుజామునే పేలే బాంబుల మోతకు.. వారి గుండె ఒక్కక్షణం ఆగి మళ్లీ.. కొట్టుకుంటోంది. పీల్చే గాలి.. తాగే నీళ్లు అన్ని కలుషితమే. అలా అని వారు.. వార్​ జోన్​లో లేరు. ఏ ప్రమాదం అంచున గూడు కట్టుకొని జీవించట్లేదు. వారున్న చోటే.. సింగరేణి ఓపెన్​కాస్ట్​ గనులు తవ్వుతున్నారు. బొగ్గు కోసం పేల్చే బాంబులు వారి గుండెల్లో పేలుతుంటే.. వినతిపత్రాలు సమర్పించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి జేవీఆర్ ఉపరితల బొగ్గుగని ఎన్టీఆర్​ నగర్​ కాలనీ వాసుల దీనగాథపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

Open Cast Coal Ntr Nagar Colony Peoples in Troubles
బొగ్గు కోసం బాంబు పేలుళ్లు.. భయాందోళనలో కాలనీ ప్రజలు!

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జేవీఆర్ ఒకటో నెంబర్​ ఓపెన్​కాస్ట్​ 2005లో ప్రారంభమైంది.ఈ గని ప్రభావం సమీపంలో ఉన్న ఎన్టీఆర్ నగర్ వాసుల జీవన స్థితిగతుల్ని పూర్తిగా మార్చేసింది. నిత్యం బొగ్గు వెలికితీత కోసం జరిగే బాంబు పేలుళ్లు, గని నుంచి ఉత్పన్నమయ్యే కాలుష్యంతో కాలనీవాసులు కొన్నేళ్లుగా సహవాసం చేస్తున్నారు. కాలనీలో మొత్తం 700 ఇండ్లున్నాయి. దాదాపు 3వేల వరకు జనాభా ఉంటారు. ఉపరితల గనిలో బొగ్గు వెలికితీత ప్రారంభమైన నాటి నుంచే కాలనీ వాసులకు కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత బొగ్గు వెలికితీత క్రమక్రమంగా పెరిగి దాదాపు పదేళ్లుగా ఈ ప్రాంత వాసులు దినదినగండంగా కాలం వెళ్లదీస్తున్నారు. బాంబు పేలుళ్ల ధాటికి ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇంటిగోడలు, ప్రహారీలు బీటలు వారాయి. ఇళ్ల పైకప్పులు పెచ్చులూడిపోయాయి. స్లాబులు పెచ్చులూడి ఎప్పుడు నెత్తిన పడుతాయో అని కాలనీ వాసులు భయంభయంగా బతుకీడుస్తున్నారు. దుమ్ము, పొగ వల్ల పీల్చే గాలి, తాగే నీరు కూడా కలుషితమై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బొగ్గు కోసం బాంబు పేలుళ్లు.. భయాందోళనలో కాలనీ ప్రజలు!

ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు..

వర్షాకాలం వస్తే.. ఎన్టీఆర్​నగర్ కాలనీ వాసుల ఇబ్బందులు అన్నీఇన్ని కావు. బాంబు పేలుళ్లతో దెబ్బతిన్న ఇళ్లల్లోకి వర్షపు నీరు వచ్చి చేరి గోడలు తడిసి నిమ్మెక్కుతున్నాయి. చేసేదేం లేక చాలామంది ఇళ్లపై పట్టాలు కప్పుకోగా.. కొంతమంది భయంతో ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. తమకు న్యాయం చేయాలని ఏళ్ల తరబడి ఆందోళనలు చేశారు. పలుమార్లు ఓసీ పనులను అడ్డుకున్నారు. జేవీఆర్ గని కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులకు తమ గోడు మొరపెట్టుకున్నారు. కానీ.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో డీఎంఎఫ్ నిధులు మంజూరు చేసి కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కనీసం ఇళ్లకు మరమ్మతులైనా చేయించాలని సింగరేణిని వేడుకున్నారు. ఇక గని పేలుళ్లతో అనారోగ్యం బారిన పడుతున్నామని.. వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకొని తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు.

హరిత ట్రిబ్యునల్​పైనే ఆశలన్నీ..

సింగరేణి అధికారులకు ఎన్నిసార్లు తమ సమస్యలు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడం వల్ల కాలనీకి చెందిన బానోత్ నందూనాయక్ అనే బాధితుడు చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యూనల్​ను ఆశ్రయించాడు. ఎన్జీటీ సౌత్ జోన్​లో పిటిషన్ వేశాడు. ఓసీలో పేలుళ్ల కారణంగా కాలనీలోని 700 ఇళ్లు దెబ్బతిన్నాయని జేవీఆర్ ఓసీలో కొంత భాగం బొగ్గు ఉత్పత్తి నిలిపివేసినా గనుల మూసివేత ప్రణాళిక అమలు చేయలేదని, బాధితుల ఫిర్యాదుపై గతంలో కలెక్టర్ విచారణ జరిపించినా కమిటీ సిఫార్సులను అమలు చేయలేదని పిటిషనర్ తరపు న్యాయవాది ఎన్జీటీకి వివరించారు. ఇటీవల జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి కేంద్ర పర్యావరణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి కాలరీస్ సంస్థ, ఖమ్మం జిల్లా కలెక్టర్​కు నోటీసులు జారీ చేసింది. జేవీఆర్ ఓసీలో ఉత్పన్నమవుతున్న బొగ్గుగనుల కాలుష్యంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి నవంబర్ 9లోగా పూర్తి నివేదికను అందించాలని ఆదేశించింది. పదేళ్లుగా పోరాడి అలసిపోయిన ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులు... ఇక హరిత ట్రిబ్యునల్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ సారైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని కాలనీ వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి తమకు పరిష్కార మార్గం చూపాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: సన్నాహక సమావేశాలు.. కార్యకర్తలకు దిశా నిర్దేశాలు!

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జేవీఆర్ ఒకటో నెంబర్​ ఓపెన్​కాస్ట్​ 2005లో ప్రారంభమైంది.ఈ గని ప్రభావం సమీపంలో ఉన్న ఎన్టీఆర్ నగర్ వాసుల జీవన స్థితిగతుల్ని పూర్తిగా మార్చేసింది. నిత్యం బొగ్గు వెలికితీత కోసం జరిగే బాంబు పేలుళ్లు, గని నుంచి ఉత్పన్నమయ్యే కాలుష్యంతో కాలనీవాసులు కొన్నేళ్లుగా సహవాసం చేస్తున్నారు. కాలనీలో మొత్తం 700 ఇండ్లున్నాయి. దాదాపు 3వేల వరకు జనాభా ఉంటారు. ఉపరితల గనిలో బొగ్గు వెలికితీత ప్రారంభమైన నాటి నుంచే కాలనీ వాసులకు కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత బొగ్గు వెలికితీత క్రమక్రమంగా పెరిగి దాదాపు పదేళ్లుగా ఈ ప్రాంత వాసులు దినదినగండంగా కాలం వెళ్లదీస్తున్నారు. బాంబు పేలుళ్ల ధాటికి ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇంటిగోడలు, ప్రహారీలు బీటలు వారాయి. ఇళ్ల పైకప్పులు పెచ్చులూడిపోయాయి. స్లాబులు పెచ్చులూడి ఎప్పుడు నెత్తిన పడుతాయో అని కాలనీ వాసులు భయంభయంగా బతుకీడుస్తున్నారు. దుమ్ము, పొగ వల్ల పీల్చే గాలి, తాగే నీరు కూడా కలుషితమై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బొగ్గు కోసం బాంబు పేలుళ్లు.. భయాందోళనలో కాలనీ ప్రజలు!

ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు..

వర్షాకాలం వస్తే.. ఎన్టీఆర్​నగర్ కాలనీ వాసుల ఇబ్బందులు అన్నీఇన్ని కావు. బాంబు పేలుళ్లతో దెబ్బతిన్న ఇళ్లల్లోకి వర్షపు నీరు వచ్చి చేరి గోడలు తడిసి నిమ్మెక్కుతున్నాయి. చేసేదేం లేక చాలామంది ఇళ్లపై పట్టాలు కప్పుకోగా.. కొంతమంది భయంతో ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. తమకు న్యాయం చేయాలని ఏళ్ల తరబడి ఆందోళనలు చేశారు. పలుమార్లు ఓసీ పనులను అడ్డుకున్నారు. జేవీఆర్ గని కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులకు తమ గోడు మొరపెట్టుకున్నారు. కానీ.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో డీఎంఎఫ్ నిధులు మంజూరు చేసి కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కనీసం ఇళ్లకు మరమ్మతులైనా చేయించాలని సింగరేణిని వేడుకున్నారు. ఇక గని పేలుళ్లతో అనారోగ్యం బారిన పడుతున్నామని.. వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకొని తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు.

హరిత ట్రిబ్యునల్​పైనే ఆశలన్నీ..

సింగరేణి అధికారులకు ఎన్నిసార్లు తమ సమస్యలు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడం వల్ల కాలనీకి చెందిన బానోత్ నందూనాయక్ అనే బాధితుడు చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యూనల్​ను ఆశ్రయించాడు. ఎన్జీటీ సౌత్ జోన్​లో పిటిషన్ వేశాడు. ఓసీలో పేలుళ్ల కారణంగా కాలనీలోని 700 ఇళ్లు దెబ్బతిన్నాయని జేవీఆర్ ఓసీలో కొంత భాగం బొగ్గు ఉత్పత్తి నిలిపివేసినా గనుల మూసివేత ప్రణాళిక అమలు చేయలేదని, బాధితుల ఫిర్యాదుపై గతంలో కలెక్టర్ విచారణ జరిపించినా కమిటీ సిఫార్సులను అమలు చేయలేదని పిటిషనర్ తరపు న్యాయవాది ఎన్జీటీకి వివరించారు. ఇటీవల జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి కేంద్ర పర్యావరణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి కాలరీస్ సంస్థ, ఖమ్మం జిల్లా కలెక్టర్​కు నోటీసులు జారీ చేసింది. జేవీఆర్ ఓసీలో ఉత్పన్నమవుతున్న బొగ్గుగనుల కాలుష్యంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి నవంబర్ 9లోగా పూర్తి నివేదికను అందించాలని ఆదేశించింది. పదేళ్లుగా పోరాడి అలసిపోయిన ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులు... ఇక హరిత ట్రిబ్యునల్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ సారైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని కాలనీ వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి తమకు పరిష్కార మార్గం చూపాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: సన్నాహక సమావేశాలు.. కార్యకర్తలకు దిశా నిర్దేశాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.