ETV Bharat / offbeat

తక్కువ ధరలో షిరిడీ సాయి దర్శనం - హైదరాబాద్ నుంచి IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ! - IRCTC SAI SHIVAM TOUR PACKAGE

షిరిడీ వెళ్లాలనుకునేవారి కోసం ఐఆర్​సీటీసీ బంపర్ ఆఫర్ - తక్కువ ధరకే నాలుగు రోజుల టూర్!

IRCTC LATEST TOUR
Sai Shivam Tour Package (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2025, 5:51 PM IST

IRCTC Sai Shivam Tour Package : ఐఆర్‌సీటీసీ టూరిజం తక్కువ ధరలోనే పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు జనాలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్​ నుంచి షిరిడీ, నాసిక్​ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలనే వారికోసం అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది​. "సాయి శివం"​ పేరుతో IRCTC టూరిజం ఈ ప్యాకేజీని ఆపరేట్​ చేస్తోంది. మరి, ఈ టూర్ ఎన్ని రోజులు సాగుతుంది? టికెట్ ధర ఎంత? వంటి పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇండియన్​ రైల్వే క్యాటరింగ్ అండ్​​ టూరిజం కార్పొరేషన్ ఆపరేట్ చేస్తోన్న(IRCTC) సాయి శివం (Sai Shivam) టూర్​ ప్యాకేజీ ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీ ఆలయం, నాసిక్​ చూడొచ్చు. హైదరాబాద్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ పర్యటన మొత్తం 3 రాత్రులు, 4 రోజులుగా కొనసాగుతుంది.

ప్రయాణం కొనసాగనుందిలా

  • మొదటి రోజు కాచిగూడ రైల్వే స్టేషన్​ నుంచి సాయంత్రం 6:40 గంటలకు ట్రైన్​(అజంతా ఎక్స్​ప్రెస్​ - 17064) స్టార్​ అవుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
  • రెండో రోజు మార్నింగ్ 7 గంటల 10 నిమిషాలకు నాగర్​సోల్​ రైల్వే స్టేషన్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి పికప్​ చేసుకుని షిరిడీ తీసుకెళ్తారు. అక్కడ హోటల్లో చెక్ ఇన్ అవ్వాలి. ఆ తర్వాత​ సాయిబాబా దర్శనం ఉంటుంది. సాయంత్రం షిరిడీలో తిరగొచ్చు. రాత్రి అక్కడే బస చేస్తారు.
  • మూడో రోజు షిరిడీలో హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి నాసిక్​కి బయలుదేరుతారు. అక్కడ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, పంచవటి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత నాగర్‌సోల్ స్టేషన్‌లో రాత్రి 08:30 గంటలకు ట్రైన్ ఉంటుంది. 09:20 గంటలకు అది బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • నాలుగో రోజు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు కాచిగూడ రైల్వే స్టేషన్​ చేరుకోవడంతో టూర్​ ముగుస్తుంది.

హైదరాబాద్​ నుంచి IRCTC సూపర్ టూర్ - ఒకే ట్రిప్‌లో కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ చూడొచ్చు!

ప్యాకేజీ ధరల విషయానికొస్తే :

కంఫర్ట్(3A)​: సింగిల్​ షేరింగ్​ రూ.8,840, ట్విన్​ షేరింగ్​ రూ.7,470, ట్రిపుల్​ షేరింగ్​ రూ.7,450గా నిర్ణయించారు. ఇక 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ.7,350, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.6,350గా నిర్ణయించారు.

స్టాండర్డ్​(SL): సింగిల్​ షేరింగ్​ రూ.7,170, డబుల్​ షేరింగ్​కు రూ.5,790, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.5,770గా నిర్ణయించారు. ఇక 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ.5,670, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.4,670 చెల్లించాలి.

  • ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా సందర్శన ప్రదేశాలకు ఏసీ వెహికల్​లో తీసుకెళ్తారు. బ్రేక్​ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ప్రయాణ ప్రణాళిక ప్రకారం అన్ని సందర్శనా స్థలాలు కవర్ అవుతాయి. అదే విధంగా నిబంధనలు వర్తిస్తాయి. అదనంగా ఏదైనా కావాలంటే వ్యక్తిగత ఖర్చులు పెట్టుకోవాలి.
  • ప్రస్తుతం ఈ టూర్ ఫిబ్రవరి 21(శుక్రవారం) తేదీన​ అందుబాటులో ఉంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్చేయండి.

'హైదరాబాద్​ to అరుణాచలం' - తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ! - తక్కువ ధరకే ఈ ప్రదేశాలన్నీ!

IRCTC Sai Shivam Tour Package : ఐఆర్‌సీటీసీ టూరిజం తక్కువ ధరలోనే పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు జనాలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్​ నుంచి షిరిడీ, నాసిక్​ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలనే వారికోసం అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది​. "సాయి శివం"​ పేరుతో IRCTC టూరిజం ఈ ప్యాకేజీని ఆపరేట్​ చేస్తోంది. మరి, ఈ టూర్ ఎన్ని రోజులు సాగుతుంది? టికెట్ ధర ఎంత? వంటి పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇండియన్​ రైల్వే క్యాటరింగ్ అండ్​​ టూరిజం కార్పొరేషన్ ఆపరేట్ చేస్తోన్న(IRCTC) సాయి శివం (Sai Shivam) టూర్​ ప్యాకేజీ ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీ ఆలయం, నాసిక్​ చూడొచ్చు. హైదరాబాద్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ పర్యటన మొత్తం 3 రాత్రులు, 4 రోజులుగా కొనసాగుతుంది.

ప్రయాణం కొనసాగనుందిలా

  • మొదటి రోజు కాచిగూడ రైల్వే స్టేషన్​ నుంచి సాయంత్రం 6:40 గంటలకు ట్రైన్​(అజంతా ఎక్స్​ప్రెస్​ - 17064) స్టార్​ అవుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
  • రెండో రోజు మార్నింగ్ 7 గంటల 10 నిమిషాలకు నాగర్​సోల్​ రైల్వే స్టేషన్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి పికప్​ చేసుకుని షిరిడీ తీసుకెళ్తారు. అక్కడ హోటల్లో చెక్ ఇన్ అవ్వాలి. ఆ తర్వాత​ సాయిబాబా దర్శనం ఉంటుంది. సాయంత్రం షిరిడీలో తిరగొచ్చు. రాత్రి అక్కడే బస చేస్తారు.
  • మూడో రోజు షిరిడీలో హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి నాసిక్​కి బయలుదేరుతారు. అక్కడ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, పంచవటి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత నాగర్‌సోల్ స్టేషన్‌లో రాత్రి 08:30 గంటలకు ట్రైన్ ఉంటుంది. 09:20 గంటలకు అది బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • నాలుగో రోజు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు కాచిగూడ రైల్వే స్టేషన్​ చేరుకోవడంతో టూర్​ ముగుస్తుంది.

హైదరాబాద్​ నుంచి IRCTC సూపర్ టూర్ - ఒకే ట్రిప్‌లో కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ చూడొచ్చు!

ప్యాకేజీ ధరల విషయానికొస్తే :

కంఫర్ట్(3A)​: సింగిల్​ షేరింగ్​ రూ.8,840, ట్విన్​ షేరింగ్​ రూ.7,470, ట్రిపుల్​ షేరింగ్​ రూ.7,450గా నిర్ణయించారు. ఇక 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ.7,350, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.6,350గా నిర్ణయించారు.

స్టాండర్డ్​(SL): సింగిల్​ షేరింగ్​ రూ.7,170, డబుల్​ షేరింగ్​కు రూ.5,790, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.5,770గా నిర్ణయించారు. ఇక 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ.5,670, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.4,670 చెల్లించాలి.

  • ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా సందర్శన ప్రదేశాలకు ఏసీ వెహికల్​లో తీసుకెళ్తారు. బ్రేక్​ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ప్రయాణ ప్రణాళిక ప్రకారం అన్ని సందర్శనా స్థలాలు కవర్ అవుతాయి. అదే విధంగా నిబంధనలు వర్తిస్తాయి. అదనంగా ఏదైనా కావాలంటే వ్యక్తిగత ఖర్చులు పెట్టుకోవాలి.
  • ప్రస్తుతం ఈ టూర్ ఫిబ్రవరి 21(శుక్రవారం) తేదీన​ అందుబాటులో ఉంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్చేయండి.

'హైదరాబాద్​ to అరుణాచలం' - తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ! - తక్కువ ధరకే ఈ ప్రదేశాలన్నీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.