ETV Bharat / state

'నీళ్లు, నిధులు, ఉద్యోగ నియామకాలు కేసీఆర్​తోనే సాధ్యం'

author img

By

Published : Mar 6, 2021, 10:10 PM IST

ఖమ్మం జిల్లా మధిరలో వరంగల్- నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్​రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ... పట్టభద్రులతో ఎంపీ నామ నాగేశ్వర రావు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రాజేశ్వర్​రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి తెరాస ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి మద్దతు తెలపాలని కోరారు.

mp nama nageshwara rao campaign in madhira
'నీళ్లు, నిధులు, ఉద్యోగ నియామకాలు కేసీఆర్​తోనే సాధ్యం'

సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలంగా మారనుందని తెరాస లోక్​స​భా పక్ష నేత ఎంపీ నామ నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో వరంగల్- నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్​ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ... పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తూ... దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని వివరించారు.

నీళ్లు, నిధులు, ఉద్యోగ నియామకాలు కేసీఆర్​తోనే సాధ్యమన్నారు. రాజేశ్వర్​రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి తెరాస ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి మద్దతు తెలపాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, డీసీసీబీ ఉపాధ్యక్షులు దొండపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్ర సర్కారుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి అభినందనలు

సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలంగా మారనుందని తెరాస లోక్​స​భా పక్ష నేత ఎంపీ నామ నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో వరంగల్- నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్​ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ... పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తూ... దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని వివరించారు.

నీళ్లు, నిధులు, ఉద్యోగ నియామకాలు కేసీఆర్​తోనే సాధ్యమన్నారు. రాజేశ్వర్​రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి తెరాస ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి మద్దతు తెలపాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, డీసీసీబీ ఉపాధ్యక్షులు దొండపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్ర సర్కారుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి అభినందనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.