ETV Bharat / state

నీలాద్రీశ్వర ఆలయంలో.. ఎమ్మెల్యే సండ్ర

author img

By

Published : Mar 11, 2021, 6:18 PM IST

ఖమ్మం జిల్లాలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. పెనుబల్లిలోని ప్రముఖ శైవ క్షేత్రం నీలాద్రీశ్వర ఆలయం భక్తుల శివనామస్మరణతో మారుమోగుతోంది. సత్తుపల్లి ఎమ్మెల్యే.. సండ్ర వెంకటవీరయ్య దంపతులు స్వామివారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు జరిపారు.

mla sandra visited neeladreeshvara temple in penuballi khammam
నీలాద్రీశ్వర ఆలయంలో.. ఎమ్మెల్యే సండ్ర

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని.. ఖమ్మం జిల్లా పెనుబల్లిలోని నీలాద్రీశ్వర ఆలయానికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కుటుంబసమేతంగా విచ్చేశారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు.

కొవిడ్​ నిబంధనల దృష్ట్యా కోనేరులో స్నానాలను నిషేధించినప్పటికీ.. భక్తులు లెక్కచేయకుండా పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. ఇప్పటివరకూ.. సుమారు లక్షకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

ఉదయం నాలుగు గంటల నుంచే అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: తాజ్​​మహల్​లో పూజలు చేసిన ముగ్గురు అరెస్టు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని.. ఖమ్మం జిల్లా పెనుబల్లిలోని నీలాద్రీశ్వర ఆలయానికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కుటుంబసమేతంగా విచ్చేశారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు.

కొవిడ్​ నిబంధనల దృష్ట్యా కోనేరులో స్నానాలను నిషేధించినప్పటికీ.. భక్తులు లెక్కచేయకుండా పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. ఇప్పటివరకూ.. సుమారు లక్షకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

ఉదయం నాలుగు గంటల నుంచే అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: తాజ్​​మహల్​లో పూజలు చేసిన ముగ్గురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.