ETV Bharat / state

MLA SANDRA: 'చేతన ఫౌండేషన్‌ సేవలు అభినందనీయం'

author img

By

Published : Jul 2, 2021, 3:40 PM IST

ఖమ్మం రోటరీ లింబ్‌ సెంటర్​లో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, పలువురు పేద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులను పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు.

'చేతన ఫౌండేషన్‌ సేవలు అభినందనీయం'
'చేతన ఫౌండేషన్‌ సేవలు అభినందనీయం'

సమాజంలోని పేదలు, అవసరం ఉన్న వారికి చేతన ఫౌండేషన్‌ ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం రోటరీ లింబ్‌ సెంటర్​​లో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, పలువురు పేద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు.

25 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, 100 మంది బ్రాహ్మణులకు నిత్యావసరాలు, నలుగురు వికలాంగులకు వీల్​ ఛైర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చేతన ఫౌండేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు వేనిగళ్ల అనిల్‌, రంగారావులను ఎమ్మెల్యే అభినందించారు.

చేతన ఫౌండేషన్​ ద్వారా పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు 25 మంది విద్యార్థులు, 100 మంది నిరుపేద బ్రాహ్మణులకు రూ.15 లక్షల విలువ చేసే ల్యాప్​టాప్​లు, నిత్యావసర వస్తువులు అందించారు. సంస్థ నిర్వాహకులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సేవా కార్యక్రమాలు మున్ముందూ ఇలాగే కొనసాగాలి.

- సండ్ర వెంకటవీరయ్య, సత్తుపల్లి ఎమ్మెల్యే

'చేతన ఫౌండేషన్‌ సేవలు అభినందనీయం'

ఇదీ చూడండి: ఓ చిన్న సంభాషణ.. సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం

సమాజంలోని పేదలు, అవసరం ఉన్న వారికి చేతన ఫౌండేషన్‌ ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం రోటరీ లింబ్‌ సెంటర్​​లో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, పలువురు పేద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు.

25 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, 100 మంది బ్రాహ్మణులకు నిత్యావసరాలు, నలుగురు వికలాంగులకు వీల్​ ఛైర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చేతన ఫౌండేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు వేనిగళ్ల అనిల్‌, రంగారావులను ఎమ్మెల్యే అభినందించారు.

చేతన ఫౌండేషన్​ ద్వారా పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు 25 మంది విద్యార్థులు, 100 మంది నిరుపేద బ్రాహ్మణులకు రూ.15 లక్షల విలువ చేసే ల్యాప్​టాప్​లు, నిత్యావసర వస్తువులు అందించారు. సంస్థ నిర్వాహకులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సేవా కార్యక్రమాలు మున్ముందూ ఇలాగే కొనసాగాలి.

- సండ్ర వెంకటవీరయ్య, సత్తుపల్లి ఎమ్మెల్యే

'చేతన ఫౌండేషన్‌ సేవలు అభినందనీయం'

ఇదీ చూడండి: ఓ చిన్న సంభాషణ.. సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.